కడ్తాల్ : ఆపరేషన్ సిందూర్లో ( Operation Sindoor ) భారత సైనికులు (Soldiers ) మరణించడం బాధకరమని టీపీసీసీ సభ్యుడు శ్రీనివాస్గౌడ్( Srinivas Goud) అన్నారు. భారత్-పాకిస్థాన్ మధ్య జరుగుతున్న యుద్ధంలో వీర మరణం పొందిన సచిన్యాదవ్, మురళీనాయక్కు శుక్రవారం నాయకులు ఘనంగా నివాళి( Tribute ) అర్పించారు. యుద్ధంలో చనిపోయిన సైనికుల చిత్రపటానికి మండల పరిధిలోని మైసిగండి గ్రామంలో నాయకులు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం గ్రామంలోని హైదరాబాద్-శ్రీశైలం జాతీయ రహదారిపై ర్యాలీ నిర్వహించి పాకిస్థాన్కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూ భారత్పై కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న పాకిస్థాన్కు మన సైన్యం ధీటైన సమాధానం చెప్పాలని కోరారు. ప్రస్తుత పరిస్థితుల్లో దేశమంతా ఒక్కటై భారత సైనికులకు బాసటగా నిలబడుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధికార ప్రతినిధి శ్రీనివాస్రెడ్డి, కాంగ్రెస్ మండలాధ్యక్షుడు బీచ్యానాయక్, నాయకులు హీరాసింగ్, దళపతిగౌడ్, జవహర్నాయక్, కిషన్, తులసీరాం, శంకర్, నర్సింహాగౌడ్ తదితరులు పాల్గొన్నారు.