హైదరాబాద్, ఏప్రిల్ 2 (నమస్తే తెలంగాణ): ‘ఆర్డర్ ఆఫ్ ది బ్రిటిష్ ఎంపైర్-2021’ అవార్డు గ్రహీత, ఉషాలక్ష్మి బ్రెస్ట్ క్యాన్సర్ ఫౌండేషన్ వ్యవస్థాపక సీఈవో డాక్టర్ పీ రఘురామ్ను లండన్ తెలుగు అసోసియేషన్(టీఏఎల్) ఘనంగా సత్కరించింది. ఉగాది పర్వదినం సందర్భంగా లండన్లోని న్యూలండన్ కాలేజీలో శనివారం సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రఘురామ్ మాట్లాడుతూ.. యూకే-భారత్ మధ్య వారధిగా ఉన్నందుకు తనకెంతో సంతోషం ఉన్నదని చెప్పారు. రొమ్ము క్యాన్సర్ నివారణకు డాక్టర్ రఘురామ్ చేస్తున్న కృషి ఎంతో గొప్పదని టీఏఎల్ చైర్మన్ భారతి కొనియాడారు.