పలుచోట్ల భాగస్వాములైన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రభుత్వం గిరిజనుల రిజర్వేషన్ల పెంపు బిల్లు ప్రతిపాదనను కేంద్రానికి పంపలేదంటూ కేంద్ర గిరిజన శాఖ మంత్రి బిశ్వేశ్వర్పై బుకాయించడంపై గిరిజన సంఘాల ప్రతినిధులు మండిపడ్డారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని ప్రభుత్వం జనాభా ప్రాతిపదికన గిరిజన రిజర్వేషన్లను 6 నుంచి 10 శాతానికి పెంచాలని 2017లో నిండు సభలో తీర్మానం చేసి పంపితే కేంద్ర హోం శాఖ సైతం గుర్తించిందని స్పష్టంచేశారు. పచ్చి అబద్ధాలతో తమ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిన బిశ్వేశ్వర్ను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ఆ మేరకు బుధవారం జిల్లావ్యాప్తంగా నల్లజెండాలు, ప్లకార్డులతో భారీ ర్యాలీలు తీసి, కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మలను దహనం చేశారు.
రిజర్వేషన్ల పెంపు ప్రతిపాదనలు కేంద్రం ఆమోదించే వరకు గిరిజనులంతా ఏకమై పోరాటం చేస్తామని స్పష్టంచేశారు. కొండమల్లేపల్లి, తిరుమలగిరి, మిర్యాలగూడ, త్రిపురారంలో చేపట్టిన నిరసనల్లో ఎమ్మెల్యేలు రమావత్ రవీంద్రకుమార్, గాదరి కిశోర్ కుమార్, నలమోతు భాస్కర్రావు, నోముల భగత్ పాల్గొని మద్దతు తెలిపారు.
సూర్యాపేట టౌన్, మార్చి 23 : సీఎం కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం గిరిజనుల రిజర్వేషన్ పెంపు ప్రతిపాదనలు కేంద్రానికి పంపలేదనడం గిరిజనులను అవమానపరచడమేనని గిరిజన సంఘాల ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం జనాభా ప్రాతిపదికన గిరిజనులకు 6 నుంచి 10 శాతానికి రిజర్వేషన్లు పెంచాలని 2017లోనే అసెంబ్లీలో తీర్మానం చేసి పంపిన ప్రతిపాదనలను వారు గుర్తు చేశారు. దీనిని కేంద్ర హోం శాఖ గుర్తించిందని పేర్కొన్నారు. అందుకు భిన్నంగా కేంద్ర గిరిజన శాఖ మంత్రి బిశ్వేశ్వర్ వ్యాఖ్యలు చేయడాన్ని గిరిజన సంఘాలు తీవ్రంగా ఖండించాయి. ఈ మేరకు బుధవారం సూర్యాపేటలో భారీ నిరసన ర్యాలీతోపాటు పాటు ప్లకార్డుల ప్రదర్శనలు, నల్లజెండాలతో ప్రదర్శన నిర్వహించారు. అనంతరం కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఎంపీపీ కుమారి, సర్పంచులు, కౌన్సిలర్లు బికారీ, అనిల్, నాగూనాయక్, భిక్షంనాయక్, లింగానాయక్, వాంకుడోతు వెంకన్న, పద్మ, విజయ, బాలాజీనాయక్, గిరిజన సంఘాలు పాల్గొన్నాయి.
కొండమల్లేపల్లి : కేంద్రంపై గిరిజనుల పోరుబాట తప్పదని దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్రకుమార్ అన్నారు. కొండమల్లేపల్లిలో ప్రధాని మోదీ దిష్టిబొమ్మ దహనంలో పాల్గొని మాట్లాడారు. గిరిజనుల ఆత్మగౌరవం దెబ్బతినేలా మాట్లాడిన బిశ్వేశ్వర్ను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. గిరిజనులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
త్రిపురారం : గిరిజనుల రిజర్వేషన్పై కేంద్రం వైఖరిని నిరసిస్తూ మండల కేంద్రంలో అఖిల భారత బంజారా సేవా సంఘం ఆధ్వర్యంలో ప్రధాని మోదీ దిష్టిబొమ్మ దహనం చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే భగత్ పాల్గొని ప్రధాని మోదీ దిష్టిబొమ్మకు నిప్పంటించారు. అఖిల భారత బంజారా సేవా సంఘం జిల్లా అధ్యక్షుడు ధన్సింగ్నాయక్, సర్పంచులు సుశీల్నాయక్, హనుమంతునాయక్, సేవానాయక్, బిచ్చునాయక్, నాయకులు జానయ్య, రవినాయక్, సయ్యద్, జయరాంనాయక్, రాంచంద్రయ్య, వెంకటాచారి, మంగ్తానాయక్ పాల్గొన్నారు.
తిరుమలగిరి : గిరిజన వ్యతిరేక బీజేపీని గద్దె దించాలని ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ అన్నారు. బుధవారం మండల కేంద్రంలో గిరిజనుల పది శాతం రిజర్వేషన్ ప్రతిపాదనలపై అసత్యాలు మాట్లాడిన కేంద్ర మంత్రి, బీజేపీకి వ్యతిరేకంగా స్థానిక తెలంగాణ చౌరస్తాలో నిరసన తెలిపారు. టీఆర్ఎస్ కార్యకర్తలు, గిరిజన నాయకులతో కలిసి ప్రధాని మోదీ దిష్ట్టిబొమ్మను దహనం చేశారు. ఎంపీపీ స్నేహలత, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రఘునందన్రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ రజిని, టీఆర్ఎస్ కార్యకర్తలు, గిరిజన నాయకులు పాల్గొన్నారు.