తిరువనంతపురం : కేరళలోని కొల్లం జిల్లాల్లో విషాదకర ఘటన చోటు చేసుకున్నది. బావిలోకి దిగి నలుగురు వ్యక్తులు ఊపిరాడక మృత్యువాతపడ్డారు. గురువారం ఉదయం నలుగురు బావిలో సిల్ట్ను తొలగించేందుకు అందులోకి దిగారు. ఈ క్రమంలో బావిని శుభ్రం చేస్తున్న సమయంలో విషవాయువు వెలువడ్డాయి. వాటిని పీల్చుకోవడంతో ఊపిరాడక కొట్టుమిట్టాడుతూ మృతి చెందారు. బావిలో ఉన్న నలుగురిని బయటకు వెలికి తీసేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో అగ్నిమాపక, రెస్క్యూ విభాగం సభ్యుడు సైతం సంఘటనా స్థలంలోనే కుప్పకూలిపోయాడు. వెంటనే అతన్ని అధికారులు అతన్ని ఆసుపత్రిలో చేర్పించారు. మృతులు సోమరాజన్ (54), రాజన్ (35), మనోజ్ (32), శివప్రసాద్ (24)గా గుర్తించారు. మృతదేహాలను బావిలో నుంచి వెలికితీసి కొల్లం జిల్లా ఆసుప్రతికి తరలించారు.