హుజూరాబాద్: బీజేపీ నాయకుడు ఈటల రాజేందర్ తన ఆస్తుల రక్షణ కోసమే ఆత్మ గౌరవమంటున్నాడని టీపీజీకేఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మిరియాల రాజిరెడ్డి ధ్వజమేత్తారు. హుజూరాబాద్ పరిధిలోని గండ్రపల్లి గ్రామంలో సోమవారం టీపీజీకేఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, నాయకులు టీఆర్ఎస్ పార్టీ ఆభ్యర్ధి గెల్లు శ్రీనివాస్ యాదవ్ను గెలిపించాలని ప్రచారం చేశారు. అనంతరం సింగరేణి కార్మికుల కుటుంబసభ్యులు, విశ్రాంత సింగరేణి కార్మికులతో సమావేశం అయ్యారు. కారుగుర్తుకు ఓటు వేసి సీఎం కేసిఆర్కు అండగా ఉండాలని కోరారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ….బీజేపీ పార్టీ రైతు కార్మిక వ్యతిరేక ప్రభుత్వమని, ఢిల్లీలో రైతుల న్యాయ పోరాటం చేస్తే, మంత్రి కొడుకు రైతులపై కారు ఎక్కించి చంపారన్నారు. బీజేపీ పాలిత ప్రాంతాల్లో రైతు బంధు, రైతు బీమా వంటి పథకాలు ఎందుకు లేవని ప్రశ్నించారు. ప్రపంచం గర్వించదగ్గ పథకాలను అమలు చేస్తున్న ఘనత సీఎం కేసిఆర్ దేనని అన్నారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ బల్మూరి పద్మ-సమ్మారావు, శ్రీరాంపూర్ ఏరియా టీపీజీకేఎస్ ఉపాధ్యాక్షుడు కేతిరెడ్డి సురేందర్, ఎరియా చర్చల ప్రతినిధులు వెంకల కుమారస్వామి, మైన్పీట్ కార్యదర్శులు గోపాల్రెడ్డి, మహేందర్రెడ్డి, సదానందం,సమ్మిరెడ్డి, రాజయ్య,నాయకులు అనుశ్రెడ్డి, గోరల్ల సంతోశ్తోపాటు తదితరులు పాల్గోన్నారు.