ముంబై, జూన్ 8: ఈరోజు స్టాక్ మార్కెట్లు లాభాల్లో మొదలయ్యాయి. సెన్సెక్స్ 52,428.72 పాయింట్ల వద్ద ప్రారంభమై, 52,432.43 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 52,135.04 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. సెన్సెక్స్ 0.20శాతం అంటే 106.35 పాయింట్లు క్షీణించి 52,224.82 పాయింట్ల వద్ద ఊగిసలాడింది. నిఫ్టీ 15,773.90 పాయింట్ల వద్ద ప్రారంభమై, 15,778.80వద్ద గరిష్టాన్ని, 15,680.00 వద్ద కనిష్టాన్ని తాకింది. నిఫ్టీ 81.40 పాయింట్లు లాభపడి 15,717.75 పాయింట్ల వద్ద ముగియడంతో టాప్ గెయినర్స్ జాబితాలో బ్రిటానియా 2.17 శాతం,హెచ్ సీఎల్ టెక్ 1.99 శాతం, టాటా కన్స్యూమర్ ప్రోడక్ట్స్ 1.85 శాతం,టెక్ మహీంద్రా 1.81 శాతం,ఇన్ఫోసిస్ 1.79 శాతం, లాభపడ్డాయి. టాప్ లూజర్స్ జాబితాలో హిండాల్కో 2.49 శాతం, టాటా స్టీల్ 1.90 శాతం, జేఎస్ డబ్ల్యు స్టీల్ 1.60 శాతం, ఎస్బీఐ 1.45 శాతం, ఐసీఐసీఐ బ్యాంకు 1.33 శాతం నష్టపోయాయి. మోస్ట్ యాక్టివ్ స్టాక్స్లో అదానీ పోర్ట్స్, బజాజ్ ఫిన్ సర్వ్, టాటా స్టీల్, ఇన్ఫోసిస్,ఎస్బీఐ ఉన్నాయి.