బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరులో శనివారం ఐపీఎల్ వేలం ప్రక్రియ మొదలైంది. శనివారం సాయంత్రానికి తొలిరోజు వేలం ముగిసింది. ఈ వేలంలో ఆటగాళ్ల కొనుగోలు కోసం 10 ఫ్రాంచైజీలు పోటీపడ్డాయి. తొలిరోజు వేలంలో ఏడుగురు ఆటగాళ్లు భారీ ధర పలికారు. ఈ అధిక ధర పలికిన ఆటగాళ్లలో ఇషాన్ కిషన్, దీపక్ చాహర్, శ్రేయాస్ అయ్యర్ తదితరులు ఉన్నారు.
ఇషాన్ కిషన్ను ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ రూ.15.25 కోట్లకు కొనుగోలు చేసింది. దీపక్ చాహర్ను చెన్నై సూపర్కింగ్స్ ఫ్రాంచైజీ రూ.14 కోట్లు పెట్టి సొంతం చేసుకుంది. ఇక శ్రేయాస్ అయ్యర్ను కోల్కతా నైట్ రైడర్స్ యాజమాన్యం రూ.12.25 కోట్లకు వేలంలో దక్కించుకుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజీ వనిందు హసరంగ, హర్షల్ పటేల్లను రూ.10.75 కోట్ల చొప్పున వెచ్చించి కొన్నది.
ఇక, మాజీ కెప్టెన్ డేవిడ్ వార్నర్ను వదులుకున్న సన్రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం నికోలస్ పూరన్ను రూ.10.75 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసింది. మరోవైపు ఢిల్లీ క్యాపిటల్ యాజమాన్యం శార్దూల్ టాకూర్ను రూ.10.75 కోట్లకు కొన్నది.