Toll Charges | మునిపల్లి, మార్చి 30: పెరుగనున్న టోల్ ప్లాజా రుసుంతో వాహనదారులకు అవస్థలు తప్పవు. ఏప్రిల్ 1నుంచి టోల్ప్లాజాల వద్ద చెల్లించే రుసుం గతంలో ఉన్నదాని కంటే భారీగా పెరిగినట్లు అధికారులు తెలిపారు. సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం కంకోల్ గ్రామ శివారులో గల డెక్కన్ టోల్ప్లాజాలో ఏప్రిల్ 1 నుంచి పెరిగిన రుసుం అమల్లోకి రానున్నది. ఫాస్టాగ్ ఉన్న వారు టోల్ప్లాజా నుంచి ఈజీగా రాకపోకలు సాగించవచ్చు.
టోల్ప్లాజా నుంచి వసూళ్లు ఇలా..
1) కారు, జీపు, వ్యాన్, లైట్మోటర్ వాహనాలకు ఒకవైపు రూ.105, రెండో సైడ్ రూ.160, ఫీ జిల్లా కమర్షియల్ వాహనాలకు ఒకసారి రాకపోకలు చెల్లించే రుసుం రూ.55, నెలసారి పాస్ ఒకసారి రాకపోకలు సాగించేందుకు రూ.3,520.
2) లైట్ కమర్షియల్, లైట్ గూడ్స్, మినీ బస్ వాహనాలకు ఒక వైపు రూ.170, రెండో వైపు రూ.255, ఫీ జిల్లా కమర్షియల్ వాహనాలకు ఒకసారి రాకపోకలు సాగించేందుకు రూ.85. నెలసారి పాస్ ఒకసారి రాకపోకలు సాగించేందుకు రూ.5,685 పెరిగింది.
3) బస్సు, ట్రాక్ ఒక వైపు రూ.355, రెండో వైపు రూ.535, ఫీ జిల్లా కమర్షియల్ వాహనాలకు ఒకసారి రాకపోకలు సాగించేందుకు రూ.180 పెరిగింది. నెలసారి పాస్ ఒకసారి రాకపోకలు సాగించేందుకు రూ.11,915.
4) త్రీ యాక్సల్, కమర్షియల్ ట్యాక్స్ వాహనాలకు ఒక వైపు రూ.390, రెండో వైపు రూ.585, ఫీ జిల్లా కమర్షియల్ వాహనాలకు ఒకసారి రాకపోకలు సాగించేందుకు రూ.195. నెలసారి పాస్ ఒకసారి రాకపోకలు సాగించేందుకు రూ.13వేలు.
5) హెవీ కస్టరుక్షన్ మెషినరీ ఒకవైపు రూ.560, రెండో వైపు రూ.840, ఫీ జిల్లా కమర్షియల్ వాహనాలకు ఒకసారి రాకపోకలు సాగించేందుకు రూ.280. నెలసారి పాస్ ఒకసారి రాకపోకలు సాగించేందుకు రూ.18,685.
6) ఓవర్సిజెడ్ వాహనాలకు ఒక వైపు 680, రెండో వైపు రూ.1025, ఫీ జిల్లా కమర్షియల్ వాహనాలకు ఒకసారి రాకపోకలు సాగించేందుకు రూ.340. నెలసారి పాస్ ఒకసారి రాకపోకలు సాగించేందుకు రూ.22,750 పెంచినట్లు అధికారులు తెలిపారు.
పైన తెలిపినట్లుగా ఏప్రిల్ 1నుంచి కంకోల్ టోల్ప్లాజా వద్ద వాహనాదారులు రూసుము చెల్లించాల్సి ఉంటుందని టోల్ప్లాజా సిబ్బంది తెలిపారు.