ముంబై,జూన్ 16: నిన్న సరికొత్త రికార్డులనుతాకిన స్టాక్ మార్కెట్లు ఇవాళ నష్టాల్లో ప్రారంభమయ్యాయి.పెట్టుబడిదార్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో మెటల్, పవర్ సూచీలు ఒక శాతం మేర నష్టపోయాయి. సెన్సెక్స్ 52,782.21 పాయింట్ల వద్ద ప్రారంభమై, 52,816.31 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 52,498.48 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. నిఫ్టీ 15,847.50 పాయింట్ల వద్ద ప్రారంభమై, 15,880.85 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 15,768.00 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది.
సెన్సెక్స్ 0.41శాతం అంటే 215.71 పాయింట్లు నష్టపోయి 52,561.64 పాయింట్ల వద్ద ట్రేడ్ అయింది. నిఫ్టీ 0.48శాతం అంటే 75.90 పాయింట్లు నష్టపోయి 15,792.85 పాయింట్ల వద్ద ట్రేడ్ అయింది. సెన్సెక్స్ 30 సూచీలో ఓఎంజీసి, మహీంద్రా అండ్ మహీంద్రా, బజాజ్ ఫిన్ సర్వ్,హెచ్ యు ఎల్ , అల్ట్రాటెక్ సిమెంట్, ఇన్ఫోసిస్, సన్ ఫార్మ, కొటాక్ మహీంద్రా బ్యాంకు, టెక్ మహీంద్రా స్టాక్స్ లాభాల్లో ఉండగా, పవర్ గ్రిడ్, డాక్టర్ రెడ్డీస్, టైటన్, రిలయన్స్, మారుతీ, ఏషియన్ పెయింట్స్, బజాజ్ ఆటో, యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఫినాన్స్, హెచ్దీ ఎఫ్సీ షేర్లు నష్టాల్లో ఉన్నాయి.