ముంబై: ఈరోజు స్టాక్ మార్కెట్ సూచీలు ఊపందుకున్నాయి. 2021 ఏడాది చివరి రోజున భారీ లాభాల్లో ట్రేడింగ్ మొదలవ్వడం విశేషం. ప్రారంభ సెషన్ లో సెన్సెక్స్ 459 పాయింట్లు పెరిగి 58,254 వద్ద.. నిఫ్టీ 134 పాయింట్లు పెరిగి 17,338 వద్ద ట్రేడవుతున్నది. టాటా కమ్యూనికేషన్స్, రూపా కంపెనీ, డాలర్ ఇండస్ట్రీస్ ,రెస్పాన్సీవ్ ఇండస్ట్రీస్, ఐడీఎఫ్సీ షేర్లు లాభాల్లో ఉన్నాయి. ఎన్టీపీసీ, ఎన్ఎల్సీ, పటేల్ ఇంజినీరింగ్, దిలీప్ బుల్డ్కాన్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.