ముంబై, జూలై : స్టాక్ మార్కెట్లు ఇవాళ లాభాల్లో మొదలయ్యాయి. ప్రారంభ ట్రేడింగ్ లో బెంచ్ మార్క్ సూచీలు సెన్సెక్స్ 117 నిఫ్టీ 33 పాయింట్ల మేర లాభాలను నమోదు చేయగా …సెన్సెక్స్ 107 పాయింట్ల లాభంతో 53,007 వద్దకు చేరింది. నిఫ్టీ 30 పాయింట్లు లాభపడి 15,885 వద్ద ఊగిసలాడుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాల నేపథ్యంలో ఈరోజు దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాలతో ప్రారంభమయ్యాయి.