పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసి మద్దతు
సీఎం కేసీఆర్పై నమ్మకాన్ని చాటిన ఉద్యోగులు
హైదరాబాద్, మార్చి 20 (నమస్తే తెలంగాణ): ఉద్యోగులు, ఉపాధ్యాయులు అంతా ప్రభుత్వానికి అండగా నిలిచారు. నీళ్లు, నిధు లు, నియామకాలే ఎజెండా సాగిన తెలంగాణ ఉద్యమంలో నాటి ఉద్యమ నేత కేసీఆర్ వెంట నడిచిన ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలు ప్రత్యేక రాష్ట్రంలో బంగారు తెలంగాణ నిర్మాణంలో సర్కారు వెంట ఉన్నారు. ఉద్య మ నాయకుడే పాలకుడిగా ఉండటంతో నాటినుంచి నేటివరకు ప్రభుత్వానికి అండ గా నిలిచారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి పథకాలలో భాగస్వాములయ్యారు.
మొదటి నుంచీ ఎంప్లాయ్ ఫ్రెండ్లీగా ఉన్న ప్రభుత్వం ఉద్యోగుల సంక్షేమానికి పెద్దపీట వేసింది. రాష్ట్రం ఏర్పడిన తొలి నాళ్లలోనే ఉద్యోగుల తో ప్రత్యేకంగా భేటీ అయిన సీఎం కేసీఆర్.. ఉద్యమంలో 42రోజులు నిర్వహించిన సకల జనుల సమ్మెకు గుర్తుగా 43శాతం భారీ ఫిట్మెంట్ ఇచ్చారు. 42 రోజుల సమ్మె కాలాన్ని ప్రత్యేక సెలవుగా ప్రకటించారు. ఉద్యోగులందరికీ యుద్ధప్రతిపాదికగా నెల రోజుల్లోనే దాదాపు 15వేల మందికి పదోన్నతులు కల్పించారు. ఈ మధ్య సీఎంను కలిసిన ఉ ద్యోగులు, ఉపాధ్యాయులు పీఆర్సీ, పదవీ విరమణ వయసు పెంపు, సీపీఎస్ ఉద్యోగు ల సమస్యపై చర్చించి భరోసా కల్పించారు. ఈ క్రమంలోనే పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు టీఆర్ఎస్ అభ్యర్థులకు ఓటు వేసి మద్దతుగా నిలిచారు. సీఎం కేసీఆర్పై తమ నమ్మకాన్ని ఓటు ద్వారా చాటారు.
వాణీదేవికి టీజీవో శుభాకాంక్షలు
ఎమ్మెల్సీగా విజయం సాధించిన వాణీదేవికి టీజీవో సంఘం అభినందనలు తెలిపిం ది. ఈ సందర్భంగా సంఘం కార్యాలయం లో స్వీట్లు పంచుకున్నారు. అనంతరం అధ్యక్షురాలు వీ మమత మాట్లాడుతూ.. వాణీదేవి ఉద్యోగుల సమస్యలను మండలిలో ప్రస్తావిస్తారని ఆశిస్తున్నామన్నారు. కార్యక్రమంలో టీజీవో ప్రధాన కార్యదర్శి ఏ సత్యనారాయణ, నగర అధ్యక్షుడు జీ వెంకటేశ్వర్లు, హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు ఎంబీ కృష్ణయాదవ్, రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు పరమేశ్వర్రెడ్డి, నాయకుడు బీ వెంకటయ్య పాల్గొన్నారు.
కాగా రాష్ట్రీయ పండిత పరిషత్తు(ఆర్యూపీపీ) రాష్ట్ర అధ్యక్షుడు మ హ్మద్ అబ్దుల్లా, ప్రధాన కార్యదర్శి గుళ్లపల్లి తిరుమల కాంతికృష్ణ, లాంగ్వేజ్ టీచర్స్ అ సోసియేషన్ (ఎస్ఎల్టీఏ) రాష్ట్ర అధ్యక్షుడు చక్రవర్తులు శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి గౌరీశంకర్ తదితరులు వాణీదేవికి శుభాకాంక్షలు తెలిపారు. పల్లా రాజేశ్వర్రెడ్డి, వాణీదేవీల గెలుపునకు కృషిచేసిన కాంట్రాక్ట్ అధ్యాపకులకు ఆర్జేడీ కాంట్రాక్ట్ అధ్యాపకుల సం ఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వెంకన్న, కుమార్ కృతజ్ఞతలు తెలిపారు.