హైదరాబాద్, ఆట ప్రతినిధి: తెలంగాణ ఓపెన్ బ్యాడ్మింటన్ చాంపియన్ టైటిల్ను అనంత శివమ్ జిందాల్ చేజిక్కించుకున్నాడు. నిజాంపేటలోని ఎస్ఎల్బీ బ్యాడ్మింటన్ అకాడమీలో ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో అనంత శివమ్ 5-3తో ఆధిక్యంలో ఉన్న సమయంలో కార్తీక్ రిటైర్డ్ హర్డ్గా వెనుదిరగడంతో అనంత శివమ్కు టైటిల్ దక్కింది. అంతకుముందు పురుషుల డబుల్స్ ఫైనల్లో శివమ్-కార్తీక్ జోడీ 21-8, 21-14తో సోమేశ్-విజ్ఞేశ్ ద్వయంపై నెగ్గింది. విజేతలకు 7హెచ్ స్పోర్ట్స్ సంస్థ డైరెక్టర్ వెంకటేశ్, వెటరన్ షట్లర్లు లక్ష్మణ్రావు, భరణి ట్రోఫీలు అందజేశారు.