తిరుమల : అయోధ్యలో రేపు జరగనున్న రామమందిర ప్రారంభోత్సవంలో పాల్గొనే అదృష్టం దక్కడం తన పూర్వజన్మ సుకృతమని టీటీడీ చైర్మన్(TTD Chairman) భూమన కరుణాకరరెడ్డి(Bhumana Karunakar Reddy) అన్నారు. రామ మందిరం ట్రస్టు కోరితే అయోధ్యలో శ్రీవారి ఆలయం (Tirumala Temple) నిర్మాణం చేపడుతామని వెల్లడించారు.
రామ మందిరం ప్రారంభం సందర్భంగా తిరుమల, తిరుపతి దేవస్థానం తయారు చేసిన లక్ష లడ్డూ(Laddus) ల ప్రసాదం ఆదివారం అయోధ్య(Ayodhya) కు చేరుకున్నాయి. ఈ సందర్భంగా ఈ లడ్డూలను రామ మందిర ట్రస్టు (Rama Mandir Trust ) ప్రతినిధులకు ఆయన అందజేశారు. అంతకు ముందు ఆలయాన్ని సందర్శించి అక్కడ జరుగుతున్న పూజల్లో పాల్గొన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కలియుగంలో తిరుమలలో స్వయం భువుగా వెలసిన వేంకటేశ్వర స్వామియే త్రేతాయుగంలో రామచంద్ర మూర్తిగా అవతరించారని చెప్పారు.
అయోధ్యలో రామాలయ నిర్మాణానికి సహకరించిన వారికి, ఆలయ ప్రారంభ మహోత్సవంలో పాల్గొంటున్న భక్తులందరికీ శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు ఉండాలని కోరారు. రామ మందిరం ట్రస్టు కోరితే అయోద్యలో శ్రీవారి ఆలయం (Tirumala Temple) నిర్మాణం చేపడుతామని వెల్లడించారు.