ముథోల్, జూన్ 9 : హైదరాబాద్లో వీధి వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగించే కు టుంబంలో చీకట్లు కమ్ముకున్నాయి. ఆనందం గా కొడుకు అక్షర శ్రీకార పూజ చేయిద్దామని కుటుంబంతో కలిసి వచ్చిన కుటుంబానికి వి షాదమే మిగిలింది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అన్నదమ్ములు గోదావరిలో ప్రమాదవశాత్తు చిక్కుకొని మృ తి చెందడం కలచి వేసిం ది. మంగళవారం మ ధ్యాహ్నం బాసర ట్రిపుల్ ఐటీ ఇంటెక్వెల్ సమీపంలో గోదావరి నది వద్ద ప్రమాదం జరిగింది. వివరాలిలా ఉన్నాయి.
హైదరాబాద్లోని కాచిగూడ చప్పల్ బజార్ ప్రాంతానికి చెందిన ముగ్గురు అన్నదమ్ములు చంద్రశేఖర్(38), రాంచందర్(36), మల్లేశ్కుమార్(31)లు గోదావరిలోకి స్నానానికి దిగారు. స్నానం చేసుకుంటూ లోతైన ప్రాం తంలోకి వెళ్లడంతో ప్రమాదవశాత్తు ప్రవాహంలో చిక్కుకొని గల్లంతయ్యారు. ముగ్గురు కనిపించకపోవడంతో ఘాట్పైన ఉన్న కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకొన్న పోలీసులు ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో కలిసి గాలింపు చర్యలు చేపట్టారు.
ముగ్గురు అన్నదమ్ముల మృతదేహాలు బయటపడడంతో ఆ ప్రాంతం బంధువుల రోదనలతో దద్దరిల్లింది. ముగ్గురు కుమారులు ఒకేసారి మృతి చెందిన వార్త తెలియగానే కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరు మున్నీరయ్యారు. ఆనందంగా స్నానం చేయడానికి వెళ్లిన వారు తిరిగి విగతజీవులుగా రావడంతో అందరిని విషాదంలో ముంచేసింది. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం భైంసా ఏరియా ఆసుపత్రికి తరలించినట్లు బాసర సీఐ దీపక్ తెలిపారు.


