నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కోటగల్లీ ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ ఎస్సీ హాస్టల్లో ముగ్గురు విద్యార్థినులు (Students Missing) కనిపించకుండా పోయారు. ఎక్కడికి వెళ్లాలని చిట్టీల్లో రాసి, లక్కీ డ్రా తీసిన బాలికలు.. అందులో వచ్చిన ప్రాంతాలకు వెళ్లినట్లు తెలుస్తున్నది. అదృశ్యమైన వారిలో పదో తరగతి చదువుతున్న ఇద్దరు, 9వ తరగతి విద్యార్థిని ఒకరు ఉన్నారు. గుర్తించిన హాస్టల్ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు.
దీంతో వసతి గృహానికి చేరుకున్న పోలీసులు తోటి విద్యార్థులను ఆరా తీశారు. ఈ సందర్భంగా చిట్టీలపై కొన్ని ప్రాంతాల పేర్లు రాశారని, వాటిని లక్కీ డ్రా తీశారని, చిట్టీల్లో వచ్చిన ప్రాంతాలకు వెళ్తున్నట్లు స్నేహితులకు చెప్పారని హాస్టల్ సిబ్బంది పోలీసులకు తెలిపారు. ఉదయం 5 గంటలకు హాస్టల్ నుంచి వెళ్లిపోయినట్లు చెప్పారు.వ్విద్యార్థుల సమాచారం మేరకు అదృశ్యమైన బాలికల కోసం పోలీసులు గాలిస్తున్నారు.