కరీంనగర్ : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. వాళ్లకు ఏ కష్టం వచ్చిందో తెలియదు కానీ చావే శరణ్యమని భావించారు. ఈ లోకం నుంచి శాశ్వతంగా వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఇంట్లోనే ఊరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డారు.
ఈ విషాదకర సంఘటన చొప్పదండి మండలం కాట్నపల్లిలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన బైరిశంకరయ్య,(56), బైరి జమున, బైరి శ్రీధర్ (25) ఇంట్లో ఊరి వేసుకుని ఆత్మ హత్య చేసుకున్నారు. గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.