TMC Manifesto : లోక్సభ ఎన్నికలకు తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) బుధవారం మేనిఫెస్టో విడుదల చేసింది. మేనిఫెస్టోలో పేద కుటుంబాలకు ఏటా పది ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, ప్రతి నెలా ఐదు కిలోల ఉచిత రేషన్, రైతులకు కనీస మద్దతు ధర వంటి పలు హామీలను గుప్పించింది. పెట్రోల్, డీజిల్ ధరలకు కళ్లెం వేస్తామని, అంతర్జాతీయ మార్కెట్ ఒడిదుడుకులను తట్టుకునేలా ధరల స్ధిరీకరణ నిధిని ఏర్పాటు చేస్తామని భరోసా ఇచ్చింది. ఉపాధి హామీ కార్డుదారులందరికీ 100 రోజుల పని గ్యారంటీని అమలు చేస్తామని, ఉన్నత విద్యా స్కాలర్ షిప్ల సంఖ్యను మూడింతలు చేస్తామని మేనిఫెస్టోలో పొందుపరిచింది.
వృద్ధాప్య ఫించన్లను నెలకు రూ. 1000కి పెంచనున్నట్టు పేర్కొంది. పేద కుటుంబాలకు ఇండ్లు నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చింది. ఇది పేదలందరికీ గౌరవంగా జీవించేందుకు దోహదపడుతుందని మమతా బెనర్జీ పేర్కొన్నారు. విపక్ష ఇండియా కూటమి అధికారంలోకి రాగానే తాము ఈ హామీలను నెరవేర్చుతామని కోల్కతాలో మేనిఫెస్టో విడుదల కార్యక్రమంలో ఆ పార్టీ రాజ్యసభ ఎంపీ డెరెక్ ఒబ్రెయిన్ తెలిపారు. ఇ
క తాము ఎన్నికల్లో గెలిస్తే, ఎన్ఆర్సీ, సీఏఏను తమ రాష్ట్రంలో అమలు చేయబోమని సీఎం మమతా బెనర్జీ(Mamata Banerjee) అంతకుముందు స్పష్టం చేశారు. సిల్చర్లో జరిగిన బహిరంగ సభలో ఆమె మాట్లాడారు. డిటెన్షన్ క్యాంపులో ఎంత మందిని బంధిస్తారని దీదీ ప్రశ్నించారు. ఈ ఎన్నికలు చాలా భయానకంగా ఉండబోతున్నాయని, గతంలో ఎన్నడు కూడా తాను ఇంత అవినీతి ఎన్నికలను చూడలేదని ఆమె పేర్కొన్నారు. మోదీ సర్కారులో అల్లర్లు గ్యారెంటీ అని, జనం కోసం మోదీ ఏదో చేస్తారని తాను ఆశించడం లేదని, ఇదో మోసపూరిత ప్రభుత్వమని, ఎటువంటి బెదిరింపులకు తాను భయపడేది లేదని ఆమె అన్నారు.
Read More :
Dubai | ఎడారి దేశాన్ని ముంచెత్తిన భారీ వర్షం.. భారత్-దుబాయ్ మధ్య నడిచే 28 విమానాలు రద్దు