‘జిల్లాలో వర్షాలు, వరదలపై క్లోజ్ మానిటరింగ్ చేస్తున్నాం. ఎలాంటి పరిస్థితి ఎదురైనా ఎదుర్కొనేందుకు అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు అప్రమత్తంగా ఉన్నారు. ఈ సారి మండల కేంద్రాల్లోనూ కంట్రోల్ రూంలు ఏర్పాటు చేశాం. అవసరమైతే రంగంలోకి రెస్క్యూ, డీఆర్ఎఫ్ బృందాలను దించుతాం. ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా ఎప్పటికప్పుడు సమస్యలను పరిష్కరిస్తున్నాం. రూరల్, అర్బన్ ఏరియాల్లో శిథిలావస్థకు చేరుకొన్న ఇళ్లను గుర్తించాలని సిబ్బందిని ఆదేశించాం. గతంలో మాదిరిగా వరంగల్లో ముంపు సమస్య లేదు. ఇంకా వర్షాలు ఉన్నందున ప్రజలు జాగ్రత్తగా ఉండాలి.’ అని వరంగల్ జిల్లా కలెక్టర్ పీ ప్రావీణ్య వివరించారు. నాలుగు రోజుల నుంచి వర్షాలు ఏకధాటిగా కురుస్తుండడంతో తీసుకుంటున్న నష్ట నివారణ చర్యలపై కలెక్టర్ ‘నమస్తే’ తో పంచుకున్నారు.
వరంగల్, జూలై 21(నమస్తేతెలంగాణ) : జిల్లాలో ఎడతెరిపిలేకుండా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజల కు ఇబ్బంది తలెత్తకుండా అధికార యం త్రాంగాన్ని ప్రభుత్వం అప్రమత్తం చేసిం ది. అన్ని శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో అలర్ట్గా ఉన్నారు. వాన, వరద పరిస్థితిని క్లోజ్గా మానిటరింగ్ చేస్తున్నారు. చిన్న సమస్య వచ్చినా వెంటనే పరిష్కరిస్తున్నారని వరంగల్ జిల్లా కలెక్టర్ పీ ప్రావీణ్య అన్నారు. జిల్లాలో వర్షాలు ఏకధాటిగా కురుస్తుండడంతో అధికార యంత్రాంగం సన్నద్ధత, ముందు జాగ్రత్త చర్యలు, వరద పరిస్థితిపై శుక్రవారం ఆమె ‘నమస్తే తెలంగాణ’ ఇంటర్వ్యూలో మాట్లాడారు.
కలెక్టర్ : వర్షాలపై ముందుగానే సమాచారం అందడంతో అన్ని శాఖల అధికారులను అలర్ట్ చేశాం. ఇరిగేషన్, పీఆర్, ఆర్అండ్బీ, పంచాయతీ, ము న్సిపల్, రెవెన్యూ, వ్యవసాయ, ఉద్యాన, ఫైర్, ఎన్పీడీసీఎల్ తదితర శాఖల అధికారులతో సమీక్షించాం. వర్షాలు ప్రారం భం కాగానే టెలీకాన్ఫరెన్స్ నిర్వహించా. వరదలొస్తే తీసుకోవల్సిన చర్యలపై సూ చనలు ఇచ్చా. అధికారులందరూ నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. పంచాయతీ కార్యదర్శి నుంచి మొదలుకుని డీపీవో, ఏఈ నుంచి ఈఈ వరకు స్టాఫ్ అంతా క్షేత్రస్థాయిలో పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. గురువారం కూడా వర్షాలు, వరదలపై మరోసారి టెలీకాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడి అప్రమత్తంగా ఉండాలని చెప్పా.
కలెక్టర్ : జిల్లా కేంద్రంలో కంట్రోల్రూమ్ ఒకటి పనిచేస్తోంది. దీని నంబర్ 91542 52937. వర్షాల వల్ల ఎదురయ్యే సమస్యలను పరిష్కరించేందుకు స్టాఫ్ ఇందులో 24 గంటలు పనిచేస్తున్నారు. ఏమైనా ఇబ్బందులు ఏర్పడితే ప్రజలు దీనికి సమాచారం అందిస్తే పరిష్కరిస్తారు. దీంతో పాటు జీడబ్ల్యూఎంసీలో కూడా ఒక కంట్రోల్రూమ్ పనిచేస్తున్నది. ఈ సారి సీఎస్ మేడమ్ ఆదేశాలతో మండల కేంద్రాల్లోనూ కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేశాం. లోక్ల్ ఆఫీసర్లు స్థానికంగా వీటి నంబర్లను ప్రజలకు తెలియజేశారు. మండల స్థాయి కంట్రోల్రూమ్ల్లో సిబ్బంది రౌండ్ దిక్లాక్ విధులు నిర్వహిస్తున్నారు. అధికారులందరూ స్థానికంగా ఉండి మానిటరింగ్ చేస్తున్నారు.
కలెక్టర్ : అదేమీ లేదు. జిల్లాలో ఉన్న ది ఒకటే ఆకేరు వాగు. అది ఉధృతంగా ప్రవహిస్తున్నది. ఈ వాగు వల్ల ముంపునకు గురయ్యే హ్యాబిటేషన్లు ఏమి లేవు. వర్షాలతో జిల్లావ్యాప్తంగా 16 ఇండ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. పర్వతగిరి, వర్ధ్దన్నపేట, నెక్కొండ, నల్లబెల్లి మండలాల్లో అతి భారీ వర్షం నమోదైంది. చిన్న కుంటలు రెండు తెగాయి. అయితే సమీపంలో హ్యాబిటేషన్లు లేకపోవడం వల్ల నష్టమేమి లేదు. పైడిపల్లి వద్ద ఇల్లు గోడ కూలి ఒకరు చనిపోయారు. పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలతో గతంలోనే రూరల్, అర్బన్లో శిథిలావస్థలో ఉన్న ఇండ్లను గుర్తించాం. రూరల్లో 30 నుంచి 40, అర్బన్లో 300 వరకు ఉన్నాయి. వీటిలో ఖాళీ చేయించాం.
కలెక్టర్ : చెరువులు మత్తడి పోస్తున్నా రాకపోకలకు అంతరాయం కలిగిన సందర్భాలు తలెత్తలేదు. కొన్ని రూట్లలో కాజ్వేల మీదుగా నీరు ప్రవహిస్తున్నది. అయినా ఎలాంటి ఇబ్బందులు లేవు. తొమ్మిది ప్రదేశాల్లో కరెంటు స్తంభాలు పడిపోయాయి. ఎన్పీడీసీఎల్ అధికారులు, సిబ్బంది వెంటనే వాటిని రెక్టిఫై చేశారు. అంతరాయం లేకుండా సరఫరాను పునరుద్ధరించారు.
కలెక్టర్ : మొత్తం 815 చెరువులు ఉన్నాయి. ఇప్పటివరకు 164 చెరువులు నిండి మత్తడి పోస్తున్నాయి. 198 చెరువులు 75 నుంచి 100 శాతం, 168 చెరువులు 50 నుంచి 75 శాతం నీటితో నిండాయి. 249 చెరువుల్లోకి 25 నుంచి 50 శాతం, 36 చెరువుల్లోకి 25 శాతంలోపు నీరు చేరింది. వర్షాలు ఎక్కువగా కురిసిన పర్వతగిరి మండలంలో 64 చెరువులు ఉంటే 45 చెరువులు మత్తడి దుంకుతున్నాయి. నర్సంపేటలో 25, నెక్కొండలో 21, చెన్నారావుపేటలో 19, నల్లబెల్లిలో 18 ఇలా 164 చెరువులు మత్తడి పోస్తున్నాయి. చెరువులకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా ఇరిగేషన్ అధికారులు మానిటరింగ్ చేస్తున్నారు. పర్వతగిరి, నల్లబెల్లి మండలాల్లో తెగిన రెండు కుంటల వద్ద కూడా నీటి నిల్వ కోసం బస్తాలను ఏర్పాటు చేశారు.
కలెక్టర్ : గతంలో మాదిరిగా వరంగల్లో సమస్య లేదు. ముంపు ప్రాంతా ల్లో నీరు నిల్వ ఉండడం లేదు. జీడబ్ల్యూఎంసీ అధికారులు, సిబ్బంది అలర్ట్గా ఉన్నారు. ఈ సారి డ్రెయిన్లపై ఫోకస్ పెట్టారు. అగ్ని మాపక శాఖ సిబ్బందితో పాటు అవసరమైతే రంగంలోకి దిగేందుకు రెస్క్యూ, డీఆర్ఎఫ్ బృందాలు రెడీగా ఉన్నాయి. ఇంకో రెండు మూడు రోజులు వర్షాలు ఉన్నందున ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. ఎలాంటి ఇబ్బంది ఎదురైనా వెంటనే అధికారుల దృష్టికి తేవాలి.