హైదరాబాద్ : కరోనా కష్ట కాలంలో ఆశ కార్యకర్తలు ఎంతో ధైర్య సాహసాలతో పని చేశారు. ఆ సమయంలో వారు చేసిన సేవలు వెలకట్టలేనివని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఆదివారం ఆశ కార్యకర్తలకు మొబైల్ ఫోన్లను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..ఆశ కార్యకర్తల కష్టాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ గుర్తించి వేతనాలు పెంచారని తెలిపారు. ప్రభుత్వ కార్యక్రమాల పర్యవేక్షణ కోసమే ఆశ కార్యకర్తలకు మొబైల్ ఫోన్లు పంపిణీ చేస్తున్నామని పేర్కొన్నారు.