మహబూబ్నగర్ టౌన్, ఏప్రిల్ 19 : రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ పని చేస్తున్నారని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని హెచ్బీ గార్డెన్, రోస్ గార్డెన్, కమల గార్డెన్లో ముస్లింలకు రంజాన్ కానుకలను మంత్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. టీఆర్ఎస్ సెక్యూలర్ ప్రభుత్వం అన్నారు. గత పాలకులు మైనార్టీలను కేవలం ఓటు బ్యాంకుగానే వాడుకున్నారని గుర్తు చేశారు. తెలంగాణ ఏర్పడ్డాక ముఖ్యమంత్రి కేసీఆర్ మైనార్టీలకు పెద్దపీట వేశారని గుర్తు చేశారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా మైనార్టీ గురుకులు పాఠశాలలు, కళాశాలలు ఏర్పాటు చేసి మెరుగైన బోధన, వసతులు కల్పించినట్లు తెలిపారు. పాలమూరు అభివృద్ధికి అన్ని విధాలా కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ ఇంతియాజ్ ఇసాక్, డీసీసీబీ చైర్మన్ నిజాం పాషా, మున్సిపల్ చైర్మన్ నర్సింహులు, టీఆర్ఎస్ కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు.