Essentials Prices | న్యూఢిల్లీ: వర్షాలు పడితేనే ధరలు తగ్గుతాయని కేంద్ర ఆర్థిక శాఖ అంచనా వేసింది. నెలవారీ సమీక్షలో భాగంగా నిత్యావసర వస్తువుల ధరలను ఆ శాఖ పరిశీలించింది. ఈసారి వర్షాకాలంలో వర్షాలు బాగా కురుస్తాయని వాతావరణ శాఖ చెప్పిందన్నారు. ఫిబ్రవరిలో రిటెయిల్ ద్రవ్యోల్బణం 8.7 శాతం కాగా, మార్చిలో ఇది 8.5 శాతానికి తగ్గిందని చెప్పింది.
మరోవైపు పప్పు ధాన్యాల ధరలను నియంత్రించేందుకు బ్రెజిల్ నుంచి 20 వేల టన్నుల పెసరపప్పు, అర్జెంటినా నుంచి కందులు దిగుమతి చేసుకొనేందుకు కేంద్రం జరుపుతున్న చర్చలు తుది దశకు వచ్చాయి. మొజాంబిక్, టాంజానియా, మయన్మార్ల నుంచి పప్పుల దిగుమతికి కేంద్రం ఒప్పందం కుదుర్చుకుంది.