సిటీబ్యూరో, సెప్టెంబర్ 4 (నమస్తే తెలంగాణ): బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలహీన పడటంతో నగరానికి భారీ వర్షం ముప్పు తప్పింది. కానీ.. రాగల రెండు రోజులు నగరంలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసే అవకాశాలున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. మరో వైపు ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయికి దగ్గరగా నమోదవుతున్నాయి. గురువారం ఉదయం నుంచి రాత్రి వరకు నగరంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 30.3 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రతలు 22.2 డిగ్రీలు, గాలిలో తేమ 63 శాతంగా నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.