బెల్లంపల్లి, జూన్ 2 : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలను శుక్రవారం బెల్లంపల్లిలో ఘనంగా నిర్వహించారు. క్యాంపు కార్యాలయం వద్ద నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య జాతీయ జెండా ఎగురవేశారు. మున్సిపల్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ముఖ్య అతిథిగా పాల్గొనగా మున్సిపల్ చైర్పర్సన్ జక్కుల శ్వేత జెండా ఆవిష్కరించారు. మున్సిపల్ కార్యాలయ ఆవరణలో మొక్కలను నాటారు. పాత బస్టాండ్ తెలంగాణ విగ్రహానికి మున్సిపల్ చైర్పర్సన్ జక్కుల శ్వేత, కౌన్సిలర్లు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. కాళోజీ శాఖ గ్రంథాలయంలో జరిగిన వేడుకల్లో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రేణికుంట్ల ప్రవీణ్ పాల్గొన్నారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపాల్ మేకల గోపాల్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో జరిగిన వేడుకల్లో ప్రిన్సిపాల్ ఆవుల అంజయ్య పాల్గొన్నారు. ఇతర ప్రభుత్వ కార్యాలయాల్లో సంబంధిత అధికారులు జాతీయ జెండాను ఎగురవేసి సంబురాలు నిర్వహించారు.
చెన్నూర్ పట్టణంలో..
చెన్నూర్, జూన్ 2: చెన్నూర్లో నిర్వహించిన వేడుకల్లో మున్సిపల్ చైర్పర్సన్ అర్చనాగిల్డా, తహసీల్దార్ శ్రీనివాస్రావు, మున్సిపల్ వైస్ చైర్మ న్ నవాజుద్దీన్, మున్సిపల్ కమిషనర్ జీ గంగాధర్, కౌన్సిలర్లు, బీఆర్ఎస్ నాయకులు, పురప్రముఖులు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.
చెన్నూర్ మండలంలో..
చెన్నూర్ రూరల్, జూన్ 2: చెన్నూర్ మండలంలో పొక్కూర్. రచ్చపల్లి, కిష్టంపేట, ముత్తరావుపల్లి, కొమ్మెర, బీరెల్లి, కత్తరశాల, అక్కెపల్లి, సుందరశాల, ఓత్కులపల్లి, చెల్లాయిపేట, సంకారం, ఆస్నాద్, నాగాపూర్, సోమన్పల్లి గ్రామాల్లో వేడకలు ఘనంగా నిర్వహించారు. అంగ్రాజ్పల్లి పీహెచ్సీ వైద్యుడు ముస్తఫా, పశువైద్యశాల పశు వైద్యుడు శ్రీనివాస్, సర్పంచ్లు కుక్కడపు నరేందర్, అయిత పార్వతి, అన్నల మానస, పాగె రాజమల్లు, డెబ్బ రవీందర్, చెడెంక పున్నం, మడక స్వప్న, బుర్ర రాకేశ్ గౌడ్, మాడ సుమతల, తోట మధూకర్, ఉప సర్పంచ్ నస్కూరి శ్రీనివాస్, నాయకులు అయిత సురేశ్ రెడ్డి, మాడ మాధవరెడ్డి, అన్నల తిరుపతి, తాళ్లపళ్లి కిరణ్ గౌడ్, తాటి రవీందర్ గౌడ్, వడ్లకొండ రవి తదితరులు నాయకులు కార్యకర్తలున్నారు.
బెల్లంపల్లి మండలంలో..
బెల్లంపల్లిరూరల్, జూన్ 2: బెల్లంపల్లిమండలంలో నిర్వహించిన వేడుకల్లో ఎంపీపీ గోమాస శ్రీనివాస్, బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం సీనియర్ శాస్త్రవేత్త, ప్రోగ్రాం కో ఆర్డినేటర్ డాక్టర్ ఎం.రాజేశ్వర్నాయక్, జడ్పీ వైస్ చైర్మన్ తొంగల సత్యనారాయణ, మండల ఉపాధ్యక్షురాలు వెంబడి రాణి, ఎంపీటీసీ శకుంతల, ఎంపీడీవో రాజేందర్, డాక్టర్ అనీశ్, ఎంపీవో వీ శ్రీనివాస్, సీనియర్ అసిస్టెంట్ కొండయ్య, బీఆర్ఎస్ నాయకులు వెంబడి సురేశ్, వెంకటేశ్, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. మండలంలోని గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో సర్పంచ్లు, ప్రభుత్వ పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయులు జాతీయ జెండాలను ఎగురవేసి తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను ఆనందోత్సహాల మధ్య నిర్వహించుకున్నారు.
తాండూర్లో..
తాండూర్, జూన్ 2 : తాండూర్ మండలంలో నిర్వహించిన వేడుకల్లో తహసీల్దార్ కవిత, ఎంపీపీ పూసాల ప్రణయ్కుమార్, మండల విద్యావనరుల కేంద్రంలో విద్యాధికారి ప్రభాకర్, సీఐ జగదీశ్, పీఏసీఎస్ చైర్మన్ సుబ్బ దత్తుమూర్తి, ట్రాన్స్కో కార్యాలయంలో ఏఈ ప్రభాకర్, ఏవో కిరణ్మయి, పీఆర్ కార్యాలయంలో డీఈ గిరీశ్బాబు, తాండూర్, మాదారం పోలీస్స్టేషన్ ఎస్ఐలు, సర్పంచ్లు, ప్రధానోపాధ్యాయులు, బీజేపీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు, జడ్పీటీసీ సాలిగామ బానయ్య, ఎంపీడీవో ప్రవీణ్కుమార్, ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు, అన్ని శాఖల అధికారులు, పోలీసులు, విద్యార్థులు, పాఠశాలల ఉపాధ్యాయులు, మండల ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.
కోటపల్లి మండలంలో..
కోటపల్లి, జూన్ 2 : కోటపల్లి మండలంలో నిర్వహించిన వేడుకల్లో ఎంపీపీ మంత్రి సురేఖ, సీఐ విద్యాసాగర్, తహసీల్దార్ సునీల్ దేశ్పాండే, పీహెచ్సీలో సత్యనారాయణ, అటవీ శాఖ కార్యాలయంలో రేంజర్ రవి, మోడల్ స్కూల్లో ప్రిన్సిపాల్ లక్ష్మారెడ్డి, కేజీబీవీలో ఎస్స్వో హరిత, జడ్పీహెచ్ఎస్లో హెచ్ఎం బాణాల లక్ష్మీనారాయణ, ప్రాథమిక పాఠశాల హెచ్ఎం అంజన్కుమార్, వ్యవసాయ శాఖ ఏవో మహేందర్, పీఏసీఎస్లో చైర్మన్ సాంబాగౌడ్, గ్రామపంచాయతీ కార్యాయంలో సర్పంచ్ రాగం రాజక్క, తదితరులు పతాకావిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో కే భాస్కర్, ఎంపీవో అక్తర్ మొహియొద్దీన్, ఎస్ఐ వెంకట్, పంచాయతీ కార్యదర్శి రాజ శేఖర్, అధికారులు, స్థానిక నాయకులున్నారు.
భీమారం మండలంలో..
భీమారం, జూన్ 2 : భీమారం మండలంలో నిర్వహించిన వేడుకల్లో ఎస్ఐ రాజవర్ధన్, ఎంపీడీవో శ్రీనివాస్, తహసీల్దార్ వాసంతి, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు కలగూర రాజ్ కుమార్, సర్పంచ్ గద్దెరాంరెడ్డి, ఆయా గ్రామాల సర్పంచ్లు, రైతు బంధు సమితి మండల అధ్యక్షుడు పర్తిరెడ్డి మహేశ్వర్ రెడ్డి, చెన్నూర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ భూక్యా రాజ్ కుమార్ నాయక్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు దాసరి మధునయ్య తదితరులు పాల్గొన్నారు.
జైపూర్ మండలంలో..
జైపూర్, జూన్ 2: జైపూర్ మండలంలో నిర్వహించిన వేడుకల్లో ఎంపీపీ గోదారి రమాదేవి, తహసీల్దార్ మోహన్రెడ్డి, వ్యవసాయాధికారి మార్క్ గ్లాడ్సన్, పీఏసీఎస్ చైర్మన్ గుండు తిరుపతి, ఏపీఎం రాజ్కుమార్, జైపూర్ ఏసీపీ నరేందర్, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు బల్మూరి అరవిందరావు పాల్గొన్నారు.
రామకృష్ణాపూర్ పట్టణంలో..
రామకృష్ణాపూర్, జూన్ 2 : రామకృష్ణాపూర్ (క్యాతనపల్లి) మున్సిపాలిటీలో నిర్వహించిన వేడుకల్లో బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్, మున్సిపల్ చైర్ పర్సన్ జంగం కళ , కమిషనర్ జీ వెంకటనారాయణ, వైస్ చైర్మన్ ఎర్రం విద్యాసాగర్రెడ్డి, కౌన్సిల్ సభ్యులు, కార్యాలయ సిబ్బంది, బీఆర్ఎస్ పట్టణ ఇన్చార్జి గాండ్ల సమ్మయ్య, కో-ఆప్షన్ సభ్యుడు కంభగోని సుదర్శన్గౌడ్, యాకూబ్ అలీ, వార్డు కౌన్సిలర్లు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
నెన్నెల మండలంలో..
నెన్నెల, జూన్ 2 : నెన్నెల మండలంలో నిర్వహించిన వేడుకల్లో తహసీల్దార్ భూమేశ్వర్, ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ సంతోషం రమాదేవి, ఎస్ఐ శ్యామ్పటేల్, ఏవో ప్రేమ్ కుమార్, జడ్పీఎస్ ఎస్ పాఠశాలలో హెచ్ఎం నారాయణ, ఫారెస్ట్ రేంజ్ అధికారి గోవింద్ చంద్, పీహెచ్సీలో డాక్టర్ అవినాశ్, ఏఈవో రాంచందర్, పీఏసీఎస్లో చైర్మన్ మేకల మల్లేశ్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పంజాల సాగర్గౌడ్, రైతు బంధు సమితి అధ్యక్షుడు అశోక్గౌడ్, కో ఆప్షన్ సభ్యుడు ఇబ్రహీం, ఎంపీటీసీలు తిరుపతి, కమల, ఏఎంసీ డైరెక్టర్ తోట మధు, నెన్నెల సర్పంచ్ తోట సూజాత, సర్పంచ్లు, కార్యదర్శులు పాల్గొన్నారు.
మందమర్రిలో..
మందమర్రి జూన్ 2 : పట్టణంలోని రామన్ కాలనీతో పాటు పాల చెట్టు మూల మలుపు వద్ద చెన్నూర్ మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదేలు జాతీయ జెండాను ఆవిష్కరించారు. అంతకు ముందు బైక్ ర్యాలీ తీశారు. వివిధ యూనియన్లు, సంఘాల కార్యాలయాల వద్ద టీబీజీకేఎస్ యూనియన్ ఏరియా ఉపాధ్యక్షుడు ఎం సంపత్, నాయకులు జెండాలను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు జే. రవీందర్, పట్టణ ఇన్చార్జి బత్తుల శ్రీనివాస్, బీఆర్ఎస్, టీబీజీకేఎస్ నాయకులు బడికెల సంపత్, బండారి సూరి బాబు, కొంగల తిరుపతి రెడ్డి, బొరిగం వెంకటేశ్, మద్ది శంకర్, పెండ్రి రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. మున్సిపల్ ప్రత్యేక అధికారి మంచిర్యాల జడ్పీ సీఈవో కే. నరేందర్, తహసీల్దార్ సంపతి శ్రీనివాస్, ఎంపీడీవో శశికళ, సీఐ గట్ల మహేందర్ రెడ్ది, ఏఈ మల్లేశం, వ్యవసాయ శాఖ ఏవో రాజేశం, ఏఈవో జాడి పోషయ్య సర్పంచ్లు జెండాలను ఆవిష్కరించి, స్వీట్లు పంపిణీ చేశారు.
వేమనపల్లి మండలంలో..
వేమనపల్లి, మే 2 : మండలంలో నిర్వహించిన వేడుకల్లో ఎంపీపీ కోలి స్వర్ణలత, తహసీల్దార్ రాజ్కుమార్, ఎస్ఐ సుబ్బారావు, సర్పంచులు, పీఏసీఎస్ చైర్మన్ గూడ కిషన్రావు, సర్పంచు మధుకర్, ఎంపీడీవో లక్ష్మయ్య, ఎంపీవో శ్రీపతి బాపురావు, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కోలి వేణుమాధవ్రావు, వైస్ ఎంపీపీ ఆత్రం గణపతి, ఎంపీటీసీ బాపు,చంద్రకల, ఏపీవో సత్య ప్రసాద్, సిబ్బంది లక్ష్మీనారాయణ, లచ్చయ్య తదితరులు పాల్గొన్నారు.
కన్నెపల్లి, భీమిని మండలాల్లో..
కన్నెపల్లి, జూన్ 2 : కన్నెపల్లి, భీమిని మండలాల్లో నిర్వహించిన వేడుకల్లో కన్నెపల్లి తహసీల్దార్ రాంచందర్, ఎంపీడీవో రాధాకిషన్, పోలీస్స్టేషన్లో ఎస్ఐ నరేశ్, కన్నెపల్లి జడ్పీటీసీ కౌటారపు సత్యనారాయణ, ఏవో శ్రీకాంత్, సర్పంచ్లు, నాయకులు పాల్గొన్నారు. భీమిని మండలంలో తహసీల్దార్ లక్ష్మీరాజం, ఎంపీపీ పోతురాజుల రాజేశ్వరి, ఎస్ఐ మహేందర్, సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీడీవో సప్దర్ అలీ తదితరులున్నారు.