న్యూఢిల్లీ: అమర్నాథ్ గుహలోని మంచు శివ లింగం మే నెలాఖరులో దాదాపు 7 అడుగుల ఎత్తు ఉండగా ప్రస్తుతం 4 అడుగుల ఎత్తుకు తగ్గడం భక్తులలో తీవ్ర ఆందోళన రేకెత్తిస్తోంది. ఈ సంవత్సరం మంచు లింగం వేగంగా కరగడానికి పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, గుహ లోపల పెరిగిన మానవ కార్యకలాపాలే కారణమని నిపుణులు పేర్కొన్నారు.
గుహ పైకప్పు నుంచి కారుతున్న నీరు మునుపటిలా సమర్థవంతంగా గడ్డ కట్టడం లేదని వారు అభిప్రాయపడ్డారు.