జమ్మికుంట : ఆర్యవైశ్య సోదరులు అందరూ ఒక్కతాటి మీద ఉందాం..సీఎం కేసీఆర్ గారి బాటలో నడిచి, హుజురాబాద్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పలువురు ఆర్యవైశ్య ప్రముఖులు కోరారు. శుక్రవారం హుజూరాబాద్ నియోజకవర్గం జమ్మికుంటలో ఆర్యవైశ్యుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర పోలీస్ హోసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కొల్లేటి దామోదర్ గుప్తా, తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా, తెలంగాణ రాష్ట్ర హస్త కళల కార్పొరేషన్ చైర్మన్ బొల్లం సంపత్, ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్, ఆర్యవైశ్య సంఘము రాష్ట్ర అధ్యక్షుడు అమరవాది లక్ష్మీ నారాయణ తదితరులు మాట్లాడారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత సాగునీటి ప్రాజెక్టుల ద్వారా..మరియు కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా రైతులు మంచిగా వరి పంట పండిస్తున్నారు. దేశానికే అన్నం పెట్టే అన్నపూర్ణ గా.. రాష్ట్రాన్ని ధాన్యగార భాండగారంగా తీర్చిదిద్దిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ ది అన్నారు. రాష్ట్రంలో 24 గంటల కరెంట్ ఇచ్చి క్రాప్ హాలిడేస్ లేకుండా చేశారు. రాష్ట్రంలో వ్యాపారులు అందరూ ప్రశాంతంగా వ్యాపారం చేసుకుంటున్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాతనే అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరిగింది.
ఆర్యవైశ్య జాతికి కూడా గౌరవం దక్కింది. ఆర్యవైశ్య కులానికి చెందిన వారిని గతంలో ఏ ముఖ్యమంత్రి, పట్టించుకోలేదు, వారికి ప్రాధాన్యత ఇవ్వలేదు కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చినంత ప్రాధాన్యత ఏ ప్రభుత్వం కూడా ఇవ్వలేదు అన్నారు. ముఖ్యం గా ఆర్యవైశ్యులకు 4 గురుకి స్టేట్ కార్పొరేషన్ చైర్మన్ పదవులు.. 11 మందికి మున్సిపల్ చైర్మన్ పదవులు, ఒకరికి ఎమ్మెల్సీ పదవి, ఒకరికి ఎమ్మెల్యే పదవి కూడా దక్కింది అని అన్నారు.
ఆర్య వైశ్యులు సామాజిక సేవలోను ముందుంటారు.ఏ పదవులు ఇచ్చినా నీతి నిజాయితీ తో కష్టపడి పని చేస్తారని అన్నారు. రాష్ట్రంలో ఇన్ని సంవత్సరాల కాలంలో ఆర్యవైశ్యులను గుర్తించి, వారికి ప్రాముఖ్యత ఇచ్చింది. న్యాయం చేసింది సీఎం కేసీఆర్ మాత్రమే..70 ఏండ్ల చరిత్ర లో జరగని న్యాయం ఆర్యవైశ్యులకు ఈ 7 సంవత్సరాల కాలంలో జరిగిందని అన్నారు. టీడీపీ, కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ఆర్యవైశ్యులకు న్యాయం చేయలేదు.
టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఆర్యవైశ్యులకు గౌరవం దక్కింది. కాబట్టి మనందరం, వారికి ఋణపడి ఉండాలన్నారు. మన రాష్ట్రంలో ఎన్నో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్న సీఎం కేసీఆర్ కు మద్దతుగా నిలబడాలని చెప్పారు. ప్రతి ఒక్కరూ కారు గుర్తుకు ఓటు వేసి గెల్లు శ్రీనివాస్ యాదవ్ ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు బచ్చు భాస్కర్ , జమ్మికుంట రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రాజమౌళి, జిల్లా ఆర్యవైశ్య యూత్ ప్రెసిడెంట్ ఇరుకుళ్ల రామకృష్ణ , అడ్వకేట్ సోమ భరత్, టీటీడీ బోర్డ్ మెంబెర్ రాములు, చింతల రవికుమార్, మాసెట్టి శ్రీనివాస్, లక్ష్మినారాయణ పెద్ద సంఖ్యలో ఆర్యవైశ్యులు పాల్గొన్నారు.