కరీంనగర్ : రూ. 12 వేలు లంచం తీసుకుంటూ కరీంనగర్ ప్రభుత్వ ప్రధాన దవాఖాన సీనియర్ అసిస్టెంట్ సురేందర్ ఏసీబీకి పట్టుబడ్డాడు. తన కింది స్థాయి ఉద్యోగి మెడికల్ బిల్ చేసేందుకు సురేందర్ డబ్బు డిమాండ్ చేయడంతో బాధితుడు రమేష్ అవినీతి నిరోధక శాఖ అధికారులను ఆశ్రయించాడు.
ఏసీబీ అధికారుల సూచన మేరకు దవాఖానలోలంచం తీసుకుంటుండగా ఏసీబీ డీఎస్పీ భద్రయ్య ఆధ్వర్యంలో సురేందర్ను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు.