ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలంలో సింగరేణి ఓసీ-2 విస్తరణకు భూములిచ్చే రైతులకు ఎకరానికి రూ.25 లక్షలు చెల్లించేందుకు అంగీకరించిన నేపథ్యంలో రైతులతో కలిసి సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య సీఎం కేసీఆర్ ఫ్లెక్సీకి పుష్పాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జాతి ప్రయోజనాల కోసం భూమిని త్యాగం చేసే రైతుల సహకారం మరువలేనిదని, వారే నిజమైన దేశభక్తులని పేర్కొన్నారు.
-సత్తుపల్లి