జహీరాబాద్, జనవరి 16 : సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలోని రూరల్ పోలీస్ స్టేషన్లో సంక్రాంతి పండగ సందర్భంగా మహిళా పోలీసులు వేసిన సందేశాత్మక ముగ్గులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. స్థానిక పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న మహిళా కానిస్టేబుల్ ఆర్. వనజ రంగురంగుల ముగ్గులతో పోలీసుల విధులు.. ప్రజలకు పలు రకాల సూచనలతో అందంగా వేసిన ముగ్గు పలువురి ప్రశంశాలను అందుకుంది.
తెలంగాణ పోలీస్ లోగో తో అందంగా రూపొందించిన ముగ్గులో హెల్మెట్ ను ధరించి ప్రాణాలు తప్పించుకో.. చైనా మాంజా ప్రాణాలకు ముప్పు, మద్యం సేవించి వాహనాలు నడపరాదు, ట్రాఫిక్ రూల్స్ పాటించండి సురక్షితంగా చేరుకోండి,ప్రాడ్ కాల్స్ పులిస్టాప్, సెల్ఫోన్లో మాట్లాడుతూ వాహనాలు నడపరాదు, సత్యమేవ జయతే అంటూ ప్రజలకు సూచనలు.. పోలీసుల విధుల, బాధ్యతల గురించి వివరిస్తూ వేసిన ముగ్గు ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది. ఎస్ఐ కాశీనాథ్ తో పాటు తోటి పోలీస్ సిబ్బంది అభినందించారు.

M