మహబూబ్నగర్ టౌన్, మార్చి 24 : కేరళలోని తిరువనంతపురంలో జరుగుతున్న సె కండ్ ఇండియన్ గ్రాండ్ ప్రిక్స్ అథ్లెటిక్స్ టో ర్నీలో పరుగుల రాణి మహేశ్వరి సత్తా చా టింది. బుధవారం 3000 మీటర్ల స్టీపుల్ ఛేజ్ ను 10 నిమిషాల 52.49 సెకన్లలో పూర్తి చేసి ప్రతిభ చాటి రజత పతకం సాధించింది. మహబూబ్నగర్ జిల్లా భూత్పూరు మండలం వెల్కిచర్లకు చెందిన మహేశ్వరి పీయూ అనుబంధ కళాశాల షాద్నగర్ ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో మూడో సంవత్సరం చదువుతున్నది. ఆమెను పీయూ వీసీ లక్ష్మీకాంత్ రాథోడ్, రిజిస్ట్రార్ పిండి పవన్ కుమార్, ఫిజికల్ డైరెక్టర్ బాల్రాజ్గౌడ్ అభినందించారు.