తిరుపతి,జూన్ 29: తిరుపతి బర్డ్ ఆసుపత్రిలో జూలై 1వ తేదీ నుంచి అవుట్పేషేంట్,ఇన్ పేషంట్ సేవలు పునఃప్రారంభించనున్నారు. ఏపీలో జులై1నుంచి పలు జిల్లాల్లో కరొన కేసులు తగ్గుముఖం పట్టడంతో సడలింపు ఇచ్చింది ఏపీ సర్కారు. ఈమేరకు బర్డ్ ఆసుపత్రిప్రత్యేకాధికారి డాక్టర్ రాచపల్లి రెడ్డెప్పరెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 8నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు రోగులకు ఓపి సేవలు అందుతాయని ఆయన తెలిపారు. ఆపరేషన్లు అవసరమైన కేసులు అడ్మిట్ చేసుకుంటామని డాక్టర్ రాచపల్లి రెడ్డెప్పరెడ్డి వెల్లడించారు.