యాదాద్రి భువనగిరి : యాదాద్రి లక్ష్మీనరసింహాస్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. ఆదివారం సెలవు దినం కావడంతో స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. తమ ఇష్ట దైవాన్ని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. ఎటు చూసినా.. క్షేత్ర సందర్శనకు వచ్చిన భక్తులతో ఆలయ పరిసరాలు సందడిగా మారాయి. అర్చకులు యాదాద్రీశుడి నిత్య కైంకర్యాలు శాస్ర్తోక్తంగా చేపట్టారు. మండపాల వద్ద భక్తుల రద్దీ నెలకొన్నది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ సిబ్బంది తగు ఏర్పాట్లను చేశారు.