మహేశ్వరం: తండాల అభివృద్దికి తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని రాష్ట్ర విద్యాశాఖమంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు.బుధవారం మండల పరిధిలోని నాగారం ,పడమటితండా,దిలావార్గూడ లో 1కోటి 30లక్షలతో నిర్మించ తలపెట్టిన అభివృద్దిపనులకు ఆమె శంకుస్థాపన చేశారు.ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతనే తండాలు అభివృద్ది పథంలో నడుస్తున్నాయని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి ఫలాలు ప్రతి ఒక్క గడపకు చేరుతున్నాయని అన్నారు. రాష్ట్రంలో ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు ఇతర రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకుంటున్నాయని అన్నారు.
మన రాష్ట్రం మన పాలనతో సుపరిపాలన కొనసాగుతుందని ఆమె అన్నారు. రాష్ట్రంలో భూమి సమస్యలు రాకుండా ఉండాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం ధరణి వెబ్సైట్ను వాడుకలోకి తీసుకొచ్చిందని ఆమె అన్నారు.అనంతరం నాగారం గ్రామంలో అంగన్వాడీ కేంద్రాన్ని ఆమె ప్రారంబించారు. ఈకార్యక్రమంలో సహకార బ్యాంకు చైర్మన్ మంచెపాండుయాదవ్, సర్పంచ్లు బండారులావణ్యలింగం, అనితారవినాయక్, పరిగిచంద్రశేఖర్రెడ్డి, శివిరాజునాయక్, మోతీలాల్నాయక్, మెగావత్రాజునాయక్, మంత్రిరాజేష్, వీరానాయక్, కందిరమేష్, ముక్కెరయాదయ్య, గుత్తిపాండు, అనితాప్రభాకర్రెడ్డి, నాగారం ఎంపీటీసీ కుండెవెంకటేష్ మండల పార్టీ అద్యక్షులు హనుమగల్లచంద్రయ్య,రైతుబంధు మండల అద్యక్షులు రాఘవేందర్రెడ్డి,మార్కెట్కమీటీచైర్ పర్సన్ వరలక్ష్మి సురేందర్రెడ్డి నాయకులు తదితరులు పాల్గొన్నారు.