చిక్కడపల్లి,ఆగస్టు16:తాటి,ఈత చెట్ల పన్నులను రద్దుచేసిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని రాష్ట్ర అబ్కారీ, క్రీడల, పర్యాటక, యువజన సర్వీసులు శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ అన్నారు. కల్లుగీత వృత్తి రక్షణకు సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ గౌడ కల్లుగీత సంఘాల సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం చిక్కడపల్లిలో బహుజన విప్లవ వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 371 జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన శ్రీనివాస్ గౌడ్ తాత్కాలికంగా ఏర్పాటు చేసిన పాపన్న గౌడ్ విగ్రాహానికి పూల మాలలువేసి ఘనంగా నివాళులు అర్పించారు.
అదే విధంగా ఎమ్మెల్యే ముఠా గోపాల్, మాజీ ఎంపీలు బూర నర్సయ్య గౌడ్, పొన్నం ప్రభాకర్, అంజన్కుమార్ యాదవ్, తెలంగాణ శాసనమండలి పూర్వ చైర్మన్ స్వామి గౌడ్, మాజీ మంత్రి పితాని సత్యనారాయణ తదితరులు సర్వాయి పాపన్న విగ్రాహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. కమిటీ రాష్ట్ర కన్వీనర్ అయిలి వెంకన్న గౌడ్ అధ్యక్షతన జరిగిన సభలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ అట్టడుగు వర్గాల కోసం పోరాటం చేసిన బహుజన వీరుడు సర్వాయి పాపన్న గౌడ్ అని అన్నారు. పాపన్న గౌడ్ పేదోళ్ళ దేవుడని, బహుజనులను కలుపుకొని వెట్టి చాకిరికి వ్యతిరేకంగా పోరాటం చేసిన వీరుడు అని కొనియాడారు.
రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమం, అభివృద్ధి కోసం ప్రత్యేక పథకాలు అమలు చేస్తోందని ఆయన తెలిపారు. అందులో దళితల అభివృద్ధికి సంక్షేమానికి దళిత బంధును సీఎం కేసీఆర్ ప్రారంభించారని అన్నారు. ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ మాట్లాడుతూ పాపన్న జీవిత చరిత్రను భావితరాలకు తెలిపేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కమిటీ చైర్మన్ బాలగౌని బాల్రాజ్ గౌడ్, రాష్ట్ర కన్వీనర్ అయిలి వెంకన్న గౌడ్, వర్కింగ్ చైర్మన్ యెలికట్టె విజయ్కుమార్ గౌడ్, గీత కార్మికుల సంఘం అధ్యక్షుడు రమణగౌడ్, రాష్ట్ర ఐక్య సాధన సమితి అధ్యక్షుడు అంబాల నారాయణ గౌడ్, బాలగౌని వెంకటేష్, గడ్డమీది విజయ్ కుమార్ గౌడ్, స్థానిక కార్పొరేటర్ రవి చారి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు బెల్లయ్య నాయక్, బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్, అంబాల నారాయణ గౌడ్, బీసీ సంఘాల నాయకులు గణేషా చారి, రవీందర్ తదితరులు