హాజీపూర్ : ఎల్లంపల్లి ప్రాజెక్టు నిర్వాసితులకు ప్యాకేజీ కింద రూ. 13 కోట్లను చేసినందుకుగాను సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు చిత్రపటాలకు టీఆర్ఎస్ నాయకులు గురువారం క్షీరాభిషేకం చేశారు. నిధుల మంజూరుతో పాటు నిర్వాసితుల బ్యాంక్ ఖాతాల్లో డబ్బులు జమ చేయించారని టీఆర్ఎస్ హాజీపూర్ మండల అధ్యక్షుడు మొగిళి శ్రీనివాస్ అన్నారు. ఎన్నికల్లో ఎమ్మెల్యే ఇచ్చిన హామీ మేరకు ఎల్లంపల్లి పునరావాస కాలనీల్లో ప్లాట్లు ఉన్న వారికి ఇంటి నిర్మాణ ప్యాకేజీ కింద ఒక్కొక్కరికి రూ. 70 వేలు ఖాతాల్లో జమ అయ్యాయని తెలిపారు. మాజీ వైస్ ఎంపీపీ మందపెల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఎల్లంపల్లి ప్రాజెక్టు నిర్మాణం ప్రారంభమైనప్పటి నుంచి ఎమ్మెల్యేగా ఉన్న దివాకర్ రావు నిర్వాసితులకు అండగా ఉంటూ నిర్వాసితులకు నష్ట పరిహారం అందించడంలో ఎనలేని కృషి చేశారన్నారు.
1450 మందికి ఒక్కొక్కరికి రూ.70 వేలు, గతంలో 9 గ్రామాల్లో సర్వేలో తప్పిపోయిన 10 నివాస గృహాలకు, ఓపెన్ స్థలానికి, యువకులకు, మేజర్సన్స్కు కూలీ డబ్బుల కింద ఒక్కొక్కరికి 2 లక్షల పరిహారం ఇప్పించారన్నారు. ఎమ్మెల్యే దివాకర్ రావు నిర్వాసితులకు ఏమి చేశారని విమర్శించిన వారికి ఇది చెంప పెట్టులాంటిదన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్లు గోళ్ల శ్రీనివాస్, కొట్టె మహేందర్, అనె మల్లేశ్, పీఏసీఎస్ చైర్మన్ వెంకటేశ్, మండల ప్రధాన కార్యదర్శి జీవన్ రావు, మండల యువత అధ్యక్షుడు బాపు, సునీల్ రావు, మండల నాయకులు పాల్గొన్నారు.