తిరుమల : శ్రీనివాస గోవిందా..శ్రీ వేంకటేశ గోవిందా అంటూ తిరుమల ( Tirumala ) దివ్యక్షేత్రంలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. నిన్న వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో 16 కంపార్టుమెంట్లు నిండిపోయాయి. టోకెన్లు లేని భక్తులకు 10 గంటల్లో సర్వదర్శనం అవుతుందని టీటీడీ అధికారులు వివరించారు.
నిన్న కలియుగ ప్రత్యక్షదైవం వేంకటేశ్వరస్వామిని 91,147 మంది భక్తులు దర్శించుకోగా
29,400 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల వల్ల శ్రీవారి హుండీకి రూ.4.31 కోట్లు ఆదాయం వచ్చిందని తెలిపారు.