మహబూబ్ నగర్ : మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ( Congress Party ) ఓటుతో బుద్ధి చెప్పాలని మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి (Ala Venkateshwar Reddy) ఓటర్లకు పిలుపునిచ్చారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం భూత్పూర్ మున్సిపాలిటీ పరిధిలో బీఆర్ఎస్ అభ్యర్థుల తరుపున ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల హామీలకు దిక్కులేదు. మున్సిపల్ ఎన్నికల్లో కొత్త హామీలు ఇస్తున్నారని ఆరోపించారు. రెండేళ్లుగా మున్సిపాలిటీల్లో చేసిందేమీ లేదని పేర్కొన్నారు. బీఆర్ఎస్ హయంలోనే మున్సిపాలిటీలు అభివృద్ధి చెందాయని అన్నారు. భూత్పూర్ లాంటి చిన్న మున్సిపాలిటీలో రూ.50 కోట్లతో అభివృద్ధి పనులు చేశామని వివరించారు. రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని వెల్లడించారు.