యాదాద్రి: యాదాద్రి లక్ష్మీసమేతుడైన నరసింహస్వామి బాలాలయంలో ఆదివారం ఆర్జిత పూజల కోలాహలం తెల్లవారు జాము మూడు గంటల నుంచే మొదలైంది. అర్చకులు స్వామి వారికి నిజాభిషేకంతో నిత్య ఆరాధనలు ప్రారంభించి ఉత్స వమూర్తులకు అభిషేకం జరిపారు.
ఉదయం మూడు గంటలకు సుప్రభాతం నిర్వహించిన అర్చకులు లక్ష్మీనరసింహుడిని ఆరాధిస్తూ ప్రత్యేక పూజలు చేశా రు. హారతి నివేదనలు అర్పించి, శ్రీసుదర్శన హోమం ద్వారా శ్రీవారిని కొలిచారు. సుదర్శన ఆళ్వారును కొలుస్తూ హోమం జరిపారు.
ప్రతీరోజు నిర్వహించే నిత్య తిరు కల్యాణోత్సవంలో భక్తులు పాల్గొన్నారు. దేవేరులను ముస్తాబు చేసి గజ వాహనంపై ముఖ మండపంలోనే ఊరేగించారు. లక్ష్మీసమేతుడైన నారసింహుడిని ఆరాధిస్తూ సుమారు గంటన్నరకు పైగా కల్యాణ తంతును జరిపారు.
ఉదయం నుంచి రాత్రి వరకు నిరాటంకంగా దర్శనాలు కొనసాగాయి. సాయంత్రం వేళ అలంకార జోడు సేవలు నిర్వహిం చారు. మండపంలో అష్టోత్తర పూజలు జరిపారు. పర్వతవర్ధనీ సమేత రామలింగేశ్వరుడికి రుద్రాభిషేకం జరిపారు. నవ గ్రహాలకు తైలాభిషేకం జరిపారు. అమ్మవారికి కుంకుమార్చనలు నిర్వహించారు. స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తు లు క్యూలైన్లలో బారులు తీరారు.
మొక్కు పూజల నిర్వహణతో ఆలయ మండపాలలో భక్తుల సందడి చేశారు. ఇలవేల్పు దర్శనం కోసం వచ్చిన భక్తులు స్వామి వారి ప్రత్యేక పూజలు జరిపి మొక్కులు తీర్చుకున్నారు. పాతగుట్ట లక్ష్మీనరసింహస్వామివారి ఆలయంలో స్వామి వారి నిత్యకైంకర్యాలు అత్యంత వైభవంగా సాగాయి. స్వామివారి సేవలో భక్తులు పాల్గొని తరించారు.