మల్కాజిగిరి, నవంబర్ 12: కేంద్ర ప్రభుత్వం రైతుల నుంచి ధాన్యం కొనాలని అల్వాల్ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్రెడ్డి అన్నారు. శుక్రవారం కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇందిరాపార్కు వద్ద నిర్వహించిన ధర్నాలో కార్పొరేటర్లు శాంతిరెడ్డి, రాజ్ జితేంద్రనాథ్ పాల్గొన్నారు. వారితో అనిల్ కిశోర్, భాస్కర్, సురేందర్రెడ్డి, కవిత ఉన్నారు.
నేరేడ్మెట్ నుంచి..
నేరేడ్మెట్, నవంబర్ 12: బీజేపీ ప్రభుత్వం అవలంభిస్తున్న రైతు వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతూ ఇందిరాపార్కు వద్ద నిర్వహించిన ధర్నాకు డివిజన్ నుంచి నాయకులు శుక్రవారం భారీగా తరలివెళ్లారు. ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ధర్నాలో వినాయకనగర్ డివిజన్ అధ్యక్షుడు తులసి సురేశ్, మహిళా అధ్యక్షురాలు శ్రీదేవి, సెక్రటరీ బాలకృష్ణ గుప్తా, అరుంధతి, రజిత, తులసి, బాలరాజు యాదవ్, ఫరీద్, చంద్రకాంత్, ప్రభాకర్రెడ్డి, ఉమేశ్, ఓం ప్రకాశ్, యాదగిరి, సీహెచ్ యాదగిరి తదితరులు పాల్కొన్నారు.
గౌతంనగర్ డివిజన్ నుంచి..
గౌతంనగర్, నవంబర్12: వరి పంటను కేంద్ర ప్రభుత్వం కొనే వరకు టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పోరాటం చేస్తామని కార్పొరేటర్ మేకల సునీత రాము యాదవ్ అన్నారు. ఇందిరాపార్కులో నిర్వహించే ధర్నాకు దయానందర్నగర్ నుంచి మేకల రాముయాదవ్, గౌతంనగర్ డివిజన్ ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, డివిజన్ కమిటీ ప్రతినిధులు, సీనియర్ నాయకులు ర్యాలీగా తరలివెళ్లారు.