మహేశ్వరం, నవంబర్ 12: రైతులు పండించిన వరి ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ మహేశ్వరం నియోజకవర్గం ఎమ్మెల్యే, రాష్ట్ర విద్యాశాఖమంత్రి సబితా ఇంద్రారెడ్డి డిమాండ్ చేశారు. కేంద్రం వడ్లు కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ మహేశ్వరం మండల కేంద్రంలో జడ్పీ చైర్ పర్సన్ తీగల అనితా హరినాథ్రెడ్డి, మాజీ శాసనసభ్యుడు తీగల కృష్ణారెడ్డితో కలిసి మహాధర్నాలో పాల్గొన్నారు. టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు అంగోతు రాజునాయక్ అధ్యక్షతన జరిగిన ఈ మహాధర్నాను ఉద్దేశించి మంత్రి మాట్లాడుతూ.. ఢిల్లీలో ఒకమాట గల్లీలో ఒక మాటతో తెలంగాణ బీజేపీ నాయకులు పబ్బం గడుపుతున్నారన్నారు. తెలంగాణ రైతులకు ఉచితంగా 24 గంటల కరెంటును ఇస్తూ నాణ్యమైన విత్తనాలు, ఎరువులను తెలంగాణలో అమలు చేస్తున్నామని తెలిపారు. ఎకరాకు రైతు బంధు రూ.10 వేలు ఇస్తూ, రైతు ముంగిట్లోనే పంటలను కొనుగోలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని మంత్రి పేర్కొన్నారు. తెలంగాణలో దశల వారీగా రుణమాఫీ చేస్తున్నామన్నారు. రైతులకు అన్యాయం జరిగితే సీఎం కేసీఆర్ నాయకత్వంలో పోరాటం చేస్తామన్నారు. రైతుబంధు, రైతు బీమాతో రైతులు సంతోషంగా ఉన్నారన్నారు. ఇతర రాష్ర్టాల మీదున్న ప్రేమ తెలంగాణపై ఎందుకు లేదో ప్రధాన మంత్రి నరేంద్రమోదీ చెప్పాలన్నారు. రాష్ట్ర బీజేపీ నాయకులు పొంతన లేని మాటలు మాట్లాడుతూ తెలంగాణ రైతులను అయోమయానికి గురిచేస్తున్నారన్నారు.
తెలంగాణలో ఉన్న రైతులపై ప్రేమ ఉంటే కేంద్రంపై ఒత్తిడి తెచ్చి వరి ధాన్యం కొంటామని అధికారికంగా కేంద్రం నుంచి ఉత్తర్వులు తేవాలని మంత్రి డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఆయాచితం శ్రీధర్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ కప్పాటి పాండురంగారెడ్డి, మాజీ ఎస్సీ కమిషన్ సభ్యులు చిలకమర్రి నర్సింహ, బడంగ్పేట్, మీర్పేట్ మేయర్లు చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి, దుర్గాదీప్లాల్ చౌహన్, డిప్యూటీ మేయర్ తీగల విక్రంరెడ్డి, పహాడీషరీఫ్, తుక్కుగూడ చైర్మన్లు మధుమోహన్, వైస్ చైర్మన్ పర్హానానాజ్, భవానీ వెంకట్రెడ్డి, కో ఆప్షన్ సభ్యులు సురెడ్డి కృష్ణారెడ్డి, మహేశ్వరం, కందుకూరు మండల అధ్యక్షుడు అంగోతు రాజునాయక్, విజయేందర్ ముదిరాజ్, ఎంపీపీ రఘుమారెడ్డి, వైస్ ఎంపీపీ సునీత, ఆర్కేపురం, తుక్కుగూడ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు నగేశ్, జిల్లెల లక్ష్మయ్య, జిల్లా రైతు సమన్వయ సమితి నాయకులు కూన యాదయ్య, మండల రైతుబంధు చైర్మన్ రాఘవేందర్రెడ్డి, నాయకులు కొత్త మనోహర్రెడ్డి, కరోళ్ల చంద్రయ్య ముదిరాజ్, ఎం.ఏ. సమీర్, దోమ శ్రీనివాస్రెడ్డి, నవీన్, కో ఆప్షన్ సభ్యులు సయ్యద్ ఆథిల్అలీ, జోరల రమేశ్, మండల మాజీ అధ్యక్షుడు హనుమగల్ల చంద్రయ్య, మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు థామస్రెడ్డి, వివిధ గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు రైతులు పాల్గొన్నారు.