జమ్మికుంట రూరల్ : పెట్రోల్ , డిజీల్ , గ్యాస్ ధరలను పెంచిన బీజేపీకి హుజురాబాద్ ఉప ఎన్నికల్లో ఓటుతో బుద్ధి చెప్పాలని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి పెర్కోన్నారు. మండల పరిధిలోని బిజిగిరిషరీప్ గ్రామంలో సోమవారం ఏర్పాటు చేసిన ధూంధాం కార్యక్రమానికి వర్ధన్నపేట్ ఎమ్మెల్యే మండల ఇంచార్జీ ఆరూరి రమేశ్ , మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే సైదిరెడ్డిలు హజరయ్యారు.
కళాకారులు తెలంగాణ ఆట పాటలతో ప్రజలను ఉర్రూతలూగించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి మాట్లాడుతూ….సీఎం కేసీఆర్ ప్రజల సంక్షేమం కోసం అనేక పథకాలను ప్రవేశపెట్టి అమలుచేస్తున్నారని అన్నారు. ప్రజలను ఈటల రాజేందర్ మోసం చేసి హుజురాబాద్ ఉప ఎన్నికలు తెచ్చారన్నారు. బీజేపీ ప్రభుత్వం నిత్యవపర ధరలను పెంచి ప్రజల పై భారం మొపిందని ధ్వజమెత్తారు.
ఈటలతో ఒరిగేదేం లేదని, టీఆర్ఎస్ పార్టీ ఆభ్యర్ధిని ప్రజలు గెలిపించాలని కోరారు. అనంతరం ఎమ్మెల్యే రమేశ్ మాట్లాడుతూ….బీజేపీ పార్టీ రైతుల గోసపెడుతుందన్నారు. సీఎం కేసీఆర్ రైతుల పక్షాన నిలిచి ధాన్యం కొనుగొళ్ళు చేపట్టారని చెప్పారు. ఆస్తుల రక్షణ కోసం ఈటల రాజేందర్ బీజేపీ బాటపట్టారని వివరించారు. మంత్రిగా పని చేయని ఈటల ఎమ్మెల్యేగా గెలిచి ఏం చేస్తాడని ప్రశ్నించారు.
సీఎం కేసీఆర్కు ప్రజలు అండగా ఉండి గెల్లు శ్రీనివాస్ యాదవ్ ను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ శ్రీరాం శ్యాం, సర్పంచ్ రాచపల్లి సదయ్య, ఎంపీటీసీ రాచపల్లి రాజయ్య, మాజీ సర్పంచుల అధ్యక్షుడు యుగేందర్రెడ్డితోపాటు వార్డు సభ్యులు పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.