అమరావతి : దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్కు చెందిన మంత్రి కొడాలి నాని తన సొంత కల్యాణ మండపంలో క్యాసినో నిర్వహించడంపై టీడీపీ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. క్యాసినో నిర్వహణపై వాస్తవాలు తెలుసుకునేందుకు టీడీపీకి చెందిన నిజ నిర్ధారణ కమిటీ సభ్యులు, శ్రేణులు గుడివాడకు రాగా వారిని అడ్డుకునేందుకు వైసీపీ శ్రేణులు కూడా పరిసర ప్రాంతాలకు పెద్ద ఎత్తున రావడంతో గుడివాడలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్నాయి.
పట్టణంలోని నాగవర్పాడు సెంటర్లో వైసీపీ కార్యకర్తలను పోలీసులు అడ్డుకోవడంతో వారు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. నగరంలో బారికెడ్లు, పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు బొండ ఉమ, వర్ల రామయ్య మాట్లాడుతూ ..సంక్రాంతి సంబరాల పేరిట లేని సంప్రాదాయం, సంస్కృతిని తీసుకొచ్చిన మంత్రి కొడాలినాని వెంటనే మంత్రివర్గం నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.
సంక్రాంతి పండుగకు పాశ్చాత్య సంస్కృతిని తీసుకొస్తున్న మంత్రి కొడాలి నాని క్యాసినో నిర్వహణపై తమ వద్ద పూర్తి ఆదారాలున్నాయని నాయకులు పేర్కొన్నారు. కొడాలి నాని క్యాసినో కథేంటో సీఎం జగన్ తేల్చాలని డిమాండ్ చేశారు. కొడాలి నానికి డబ్బు పిచ్చి పట్టి అమ్మాయిలను గోవా నుంచి తీసుకొచ్చి వ్యాపారం చేస్తున్నారని ఆయన మీద ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో చెప్పాలని పేర్కొన్నారు. క్యాసినో వ్యవహారం మీరు తెలిసే జరుగుతుందా
సంక్రాంతి పండుగకు పాశ్చాత్య సంస్కృతిని తీసుకొస్తున్న మంత్రి కొడాలి నాని క్యాసినో నిర్వహణపై తమ వద్ద పూర్తి ఆదారాలున్నాయని నాయకులు పేర్కొన్నారు. కొడాలి నాని క్యాసినో కథేంటో సీఎం జగన్ తేల్చాలని డిమాండ్ చేశారు. కొడాలి నానికి డబ్బు పిచ్చి పట్టి అమ్మాయిలను గోవా నుంచి తీసుకొచ్చి వ్యాపారం చేస్తున్నారని ఆయన మీద ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో చెప్పాలని పేర్కొన్నారు. క్యాసినో వ్యవహారం మీరు తెలిసే జరుగుతుందా అని సీఎం జగన్ను ప్రశ్నిస్తునట్లు ఆయన వెల్లడించారు. డీజీపీ కార్యాలయానికి సమీపంలోనే జరుగుతుంటే పట్టించుకోవడం లేదని , కేసును డీజీపీ నీరుగార్చే ప్రయత్నాలు చేస్తే న్యాయపరంగా వెళ్తామని నాయకులు వెల్లడించారు.
సీఎం జగన్ను ప్రశ్నిస్తునట్లు ఆయన వెల్లడించారు. డీజీపీ కార్యాలయానికి సమీపంలోనే జరుగుతుంటే పట్టించుకోవడం లేదని , కేసును డీజీపీ నీరుగార్చే ప్రయత్నాలు చేస్తే న్యాయపరంగా వెళ్తామని నాయకులు వెల్లడించారు.