హైదరాబాద్, సెప్టెంబర్ 10 (నమస్తే తెలంగాణ): అసెంబ్లీ సమావేశాల సందర్భంగా బందోబస్తు విధుల్లో ఉన్న మహిళా కానిస్టేబుళ్లతో స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ నెల 7న అసెంబ్లీ పరిసరాల్లో జరిగిన ఆందోళన సందర్భంగా శాంతిభద్రతల పరిరక్షణలో మహిళా పోలీసులు ఎదుర్కొన్న ఇబ్బందులపై ఆరా తీశారు.
ఉన్నతాధికారుల ఆదేశాలమేరకు మహిళా ఉద్యోగులు తమ విధులను ఎంతో సమర్థంగా, బాధ్యతాయుతంగా నిర్వహించారని ప్రశంసించారు. విధుల్లో భాగంగా ఎలాంటి ఒత్తిళ్లకు లోనుకావద్దని, ఎప్పుడూ మనోధైర్యం కోల్పోవద్దని స్పీకర్ ప్రసాద్కుమార్ సూచించారు.