హుజూరాబాద్ టౌన్: ప్రజా సంక్షేమమే తెలంగాణ సర్కారు ధ్యేయమని, అన్ని వర్గాలనూ ఆదుకునేలా సంక్షేమ పథకాలతో ముందుకుపోతున్నదని రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్ పేర్కొన్నారు. హుజూరాబాద్ మున్సిపల్ పరిధిలోని 6,17వ వార్డుల్లో శనివారం ఆయన టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్యాదవ్ తరఫున ప్రచారం నిర్వహించారు. అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణ..దేశానికే దిక్సూచిలా నిలిచిందన్నారు. హుజూరాబాద్ ప్రజలను ఓటు అడిగే నైతిక హక్కు బీజేపీ నాయకులకు లేదన్నారు.
గెల్లు శ్రీనివాస్యాదవ్కు సీఎం కేసీఆర్ ఆశీర్వచనాలు ఉన్నాయని బండ శ్రీనివాస్ చెప్పారు. గెల్లు గెలిస్తేనే హుజూరాబాద్ నియోజకవర్గం అభివృద్ధి బాటపడుతుందని చెప్పారు. గెల్లు శ్రీనివాస్యాదవ్ నిరుపేద బిడ్డని, పేదల కష్టాలు తెలిసినవాడని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో ముందుండి పోరాడడని, వందల కేసులు..జైలు జీవితం ఆయన అనుభవాలని తెలిపారు. ప్రజలంతా కారు గుర్తుకే ఓటేసి గెల్లు శ్రీనివాస్యాదవ్ను భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. బండ శ్రీనివాస్ వెంట కరీంనగర్ కార్పొరేటర్ గుగ్గిళ్ల జయశ్రీ, కౌన్సిలర్ తాళ్లపల్లి శ్రీనివాస్గౌడ్, సిద్దిపేట కౌన్సిలర్ రియాజ్, జడ్పీ మాజీ కో ఆప్షన్ సభ్యుడు ఎండీ జమీలొద్దీన్, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలున్నారు.