795 గ్రాముల డ్రగ్ స్వాధీనం.. ఐదుగురి అరెస్టు
హైదరాబాద్, ఫిబ్రవరి 2 : విశాఖ నుంచి గుట్టుగా హషీష్ ఆయిల్ తెచ్చిన ముఠాను ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ బృందం అరెస్టు చేసింది. ఎక్సైజ్ సూపరింటెండెంట్ కే పవన్కుమార్ ఆధ్వర్యంలో రంగారెడ్డి జోన్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ సిబ్బంది మంగళవారం సాయంత్రం నాగోల్ క్రాస్రోడ్స్, బలంపేట్ సంజీవరెడ్డి నగర్ ప్రాంతంలో దాడులు నిర్వహించింది. విశాఖపట్నం నుంచి హషీష్ ఆయిల్ తీసుకొచ్చి హైదరాబాద్లో అమ్ముతున్న ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 795 గ్రాముల హషీష్ ఆయిల్ రెండు వాహనాలు, ఐదు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్టు ఎక్సైజ్ సీఐ పీ శ్రీధర్ తెలిపారు.