హైదరాబాద్, జనవరి 30 : రాష్ట్రంలో 12,769 గ్రామపంచాయతీలు.. కొత్త పంచాయతీ రాజ్ చట్టం.. పల్లె ప్రగతి.. మూడేండ్లలో రూ.16 వేల కోట్లు.. గ్రామాల్లోని సంక్షేమం, అభివృద్ధికి మచ్చుతునకలు ఇవి. ప్రస్తుతం ఉన్న సర్పంచ్లు ఎన్నికై ఫిబ్రవరి 2తో మూడేండ్లు పూర్తి అవుతున్నది. ఈ సందర్భంగా పల్లెల్లో అభివృద్ధిని పరిశీలిస్తే.. మూడేండ్లలో గ్రామాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభు త్వం రూ.16,070.77 కోట్లు ఖర్చు చేసింది. మరోవైపు, నూతన పంచాయతీరాజ్ చట్టం ద్వారా ప్రజాప్రతినిధుల్లో జవాబుదారీతనం తీసుకొచ్చింది. వారికి విధులు, బాధ్యతలు స్పష్టంగా పేర్కొన్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో పల్లెలన్నీ కొత్త శోభను సంతరించుకొన్నాయి.