కవాడిగూడ :దేశంలో ఎక్కడలేని విధంగా పేదల సంక్షేమానికి సీఎం కేసీఆర్ ఎన్నో సంక్షేమ పధకాలు ప్రవేశ పెట్టి వారి అభివృద్దికి కృషి చేస్తున్నారని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. నిరుపేదల ఆడబిడ్డల పెండ్లీళ్లకు ఆసరగా కళ్యాణలక్ష్మీ, షాదీముబారక్ పథకాలను తీసుకువచ్చి సీఎం కేసీఆర్ తెలంగాణకే తండ్రిగా నిలిచారని అన్నారు. ఈ మేరకు గురువారం ముషీరాబాద్లోని కశిష్ ఫంక్షన్ హాల్లో ముషీరాబాద్, హిమాయత్నగర్ మండలాలలోని 79 మంది లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మీ, షాదీముబారక్ చెక్కులను ఆయన భోలక్పూర్, కవాడిగూడ డివిజన్ల కార్పొరేటర్లు మహ్మద్ గౌసొద్దీన్ తహ, గోడ్చల రచనశ్రీ, డిప్యూటీ తహశీల్ధార్లు చందన, ఆసిఫ్ఖాన్లతో కలిసి పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముఠా గోపాల్ లబ్ధిదారులను ఉద్దేశించి మాట్లాడుతూ ముషీరాబాద్ మండల పరిధిలో 105 మందికి షాదీముబారక్ చెక్కులు, 30 కళ్యాణలక్ష్మీ చెక్కులు, హిమాయత్నగర్ మండల పరిధిలో 3 షాదీముబారక్, 41 మంది లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మీ చెక్కులు మొత్తం 179 అందజేసినట్లు ఆయన తెలిపారు. ఈ రోజు ఒక్కకోజే ముషీరాబాద్లో దాదాపు రూ. 2 కోట్ల చెక్కులను అందజేసినట్లు ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నగర యువజన విభాగం నాయకుడు ముఠా జయసింహ, టీఆర్ఎస్ భోలక్పూర్ ఇన్చార్జి బింగి నవీన్కుమార్, భోలక్పూర్, గాంధీనగర్, కవాడిగూడ డివిజన్ల టీఆర్ఎస్ అధ్యక్ష, కార్యదర్శులు మహ్మద్ అలీ, ఎరం శ్రీనివాస్ గుప్తా తదితరులు పాల్గొన్నారు.