సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: బధిర మహిళల జాతీయ టీ20 చాంపియన్షిప్లో తెలంగాణ జట్టు బరిలోకి దిగుతున్నది. ఈనెల 26 నుంచి 29 వరకు ముంబైలో టోర్నీ జరుగుతున్నట్లు రాష్ట్ర బధిర క్రికెట్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి రాజారాం శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్ర క్రికెట్ బృందానికి కెప్టెన్గా రేఖ, వైస్ కెప్టెన్గా కాంతమ్మ వ్యవహరించనున్నారు. ఈ టోర్నీలో తెలంగాణతో సహా చండీగఢ్, ఢిల్లీ, హర్యానా, మహారాష్ట్ర, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, తమిళనాడు పాల్గొంట్లున్నట్లు వెల్లడించారు.