హైదరాబాద్, ఏప్రిల్ 19 (నమస్తే తెలంగాణ): భారీగా పెరిగిన ఎండలు, వరుసగా వచ్చిన సెలవులు, పెండ్లిళ్ల సీజన్ సందర్భంగా ఈనెల తెలంగాణలో భారీగా బీర్ల అమ్మకాలు పెరిగాయి. ఈనెల 1 నుంచి 18 వరకు రూ.670 కోట్ల విలువైన బీర్లను తాగేశారు. ఏప్రిల్ 1 నుంచి 18 వరకు 23,58,827 కేస్ల బీర్లు అమ్మడయ్యాయి.
ఇది ఇప్పుడు ఆల్టైమ్ రికార్డు. గతేడాది ఇదే నెలలో అమ్ముడైన రికార్డును బ్రేక్ చేస్తూ.. ఈ ఏడాది అధికంగా 28.7 శాతం బీర్ల అమ్మకాలు జరిగాయి. దీంతో రాష్ట్రంలో ఎక్కడా కూడా బీర్ల కొరత లేకుండా ఎక్సైజ్ అధికారులు చూస్తున్నారు.