హైదరాబాద్ : కృష్ణా నదీ యాజమాన్య బోర్డు చైర్మన్కు తెలంగాణ ఈఎన్ఎసీ మురళీధర్ గురువారం లేఖ రాశారు. పోతిరెడ్డిపాడు, శ్రీశైలం కుడికాలువ ద్వారా ఏపీకి కృష్ణా జలాల తరలింపుపై లేఖలో ప్రస్తావించారు. ఏపీ 34 టీఎంసీలకు మంచి నీరు తీసుకోకుండా చూడాలని బోర్డు చైర్మన్ను ఈఎస్సీ కోరారు. 880 అడుగులపైన నీరున్నప్పుడు ఏపీ 34 టీఎంసీలే తీసుకోవాలని, అంతకు మించి తీసుకోకుండా చూడాలన్నారు.
ఏపీ చేపట్టిన అన్ని ప్రాజెక్టులను గెజిట్లో చేర్చాలని పేర్కొన్నారు. ప్రాజెక్టుల పనులను గెజిట్ రెండో షెడ్యూల్లో చేర్చాలన్నారు. పోతిరెడ్డిపాడు ద్వారా అక్రమంగా అధిక జలాల తరలిస్తోందని, ప్రాజెక్టులో నీటిమట్టం 880 అడుగులపై నుంచే పోతిరెడ్డిపాడు ద్వారా నీరు తీసుకునేలా చూడాలన్నారు. పోతిరెడ్డిపాడును 11,150 క్యూసెక్కుల వరకు విడుదల చేసేందుకు డిజైన్ చేశారని, శ్రీశైలం కుడి ప్రధాన కాలువను 20వేల క్యూసెక్కులకు పెంచారన్నారు.
వరద సమయాల్లో జూలై, అక్టోబర్ మధ్య మాత్రమే నీరు వదలాలని, 34 టీఎంసీలకు మంచి తీసుకోవడానికి జలసంఘం అనుమతి లేదని చెప్పారు. శ్రీశైలం నుంచి వెంటనే నీటి విడుదల ఆపేయాలని చైర్మన్ను కోరారు. పోతిరెడ్డిపాడు, ఎస్ఆర్ఎంసీని, ఎస్కేప్ రెగ్యులేటర్, తెలుగు గంగ ప్రాజెక్టులు అనుమతి లేనివిగా పేర్కొనాలని లేఖలో విజ్ఞప్తి చేశారు.